అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరి కొద్ది రోజుల్లో అధ్యక్ష పదవిని వదులుకోనున్నారు. గతంలో అక్రమంగా తుపాకీ కలిగి ఉండటం, పన్ను ఎగవేత కేసులో ఆయన తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించారు. తన కొడుకు క్షమాపణ కోసం అధ్యక్ష పదవిని ఉపయోగించబోనని ఇచ్చిన హామీపై యూటర్న్ తీసుకున్నారు. ఇది మాత్రమే కాదు.. ఈ క్షమాపణ నేరానికి శిక్ష పడకుండా హంటర్ను కాపాడుతుంది.
అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి వరుసగా భారతీయుల హతం అవుతున్నారు. ఆ మధ్య హైదరాబాద్కు చెందిన విద్యార్థిని దుండగులు కిడ్నాప్ చేసి హతమార్చారు.
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పడింది. గత కొద్ది రోజులుగా యుద్ధంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలతో అట్టుడికాయి. క్షిపణి, బాంబు దాడులతో రెండు దేశాలు దద్దరిల్లాయి. మొత్తానికి అమెరికా జోక్యంతో కాల్పులకు ఫుల్స్టాప్ పడింది.
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కు తదుపరి డైరెక్టర్గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్యను ఎంపిక చేశారు.
Gun Firing In Bar: మెక్సికోలోని ఆగ్నేయ ప్రాంతంలో గుర్తు తెలియనివారు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 6 మంది మృతి చెందగా, మరో 5 మంది గాయపడ్డారు. హింసాత్మక సంఘటనలతో పోరాడుతున్న తీరప్రాంత ప్రావిన్స్ టబాస్కోలో ఈ కాల్పులు జరిగాయి. విల్లాహెర్మోసాలో కాల్పులు జరిగాయని పబ్లిక్ సెక్యూరిటీ సెక్రటరీ సోషల్ మీడియా పోస్ట్లో తెలిపారు. ఫెడరల్ అధికారులు ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక అధికారుల సహకారం తీసుకుంటున్నారు. Also Read:…
లండన్లో అమెరికా రాయబారి కార్యాలయం దగ్గర అనుమానాస్పద ప్యాకేజీ తీవ్ర కలకలం రేపింది. దీంతో యూకే పోలీసులు అప్రమత్తమై శుక్రవారం ప్యాకేజ్ను నిర్వీర్యం చేశారు. ప్యాకేజీ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై లండన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అమెరికా ఎంబసీ వెల్లడించింది. మరోవైపు గాట్విక్ ఎయిర్పోర్టులో భద్రతాపరమైన ఘటన మరొకటి జరిగింది. దీంతో ఎయిర్పోర్టు దక్షిణ టెర్మినల్ను ఖాళీ చేయించామని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే రష్యా- ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కో, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.…
అమెరికాలోని కాలిఫోర్నియా బీచ్లో ఒక అరుదైన చేపను రీసెర్చ్ స్కాలర్ కనుగొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పీహెచ్డీ అభ్యర్థి షేర్ చేశాడు. ‘ఓర్ఫిష్’ లేదా ‘డూమ్స్డే ఫిష్’గా పిలిచే ఈ చేప చాలా అరుదైందిగా పేర్కొన్నాడు.
దేశీయ స్టాక్ మార్కె్ట్కు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు ముందు సరికొత్త జోష్ వచ్చింది. గత ఐదు నెలల్లో ఎన్నడూ చూడని విధంగా సూచీలు రాకెట్లా దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్కు బాగా కలిసొచ్చాయి.
Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ ప్యాంగ్యాంగ్లో నిర్వహించిన మిలటరీ ఎగ్జిబిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ర రాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచుతోందన్నారు.