Bird Flu Outbreak In US: బర్డ్ ప్లూ అనేది కేవలం భారతదేశంలోనే కాదు అగ్రరాజ్యం అమెరికానూ సైతం భయపెడుతుంది. ఒకవైపు, బర్డ్ ఫ్లూ వల్ల మన దేశంలో చికెన్, గుడ్లు తినాలంటే ప్రజలు భయపడుతున్నారు. దీంతో చికెన్, గుడ్ల అమ్మకాలు అమాంతం పడిపోయాయి. అలాగే, అమెరికాలో ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో కోడిగుడ్ల ధరలు రోజు రోజుకు కొండెక్కుతున్నాయి.
చాట్జీపీటీ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ (26) కేసును అమెరికా పోలీసులు క్లోజ్ చేశారు. సుచిర్ బాలాజీది హత్య కాదని.. ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తేల్చారు.
గత మూడేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. ఇరు దేశాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేందుకు అమెరికా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్లో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమవుతారు.
గాజాను స్వాధీనం చేసుకుని తీరుతామని మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తాజా పరిణామాలపై జోర్దాన్ రాజు అబ్దుల్లాతో ట్రంప్ చర్చించారు. గాజాను కొనాల్సిన అవసరం లేదని.. దానిని స్వాధీనం చేసుకుని తీరుతామని ట్రంప్ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులపై వేటు వేసే బాధ్యతను ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ చేతికి అప్పగించారు. రెండో దఫా పరిపాలనలో మస్క్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.
అమెరికా బాటలోనే యూకే ప్రభుత్వం వెళ్తోంది. అక్రమంగా ఉంటున్న భారతీయులకు బేడీలు వేసి మరీ అమెరికా తిరిగి పంపించేస్తోంది. తాజాగా అదే బాటలో బ్రిటన్ ప్రభుత్వం కూడా నడుస్తోంది.
ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్లో మోడీ పర్యటించనున్నారు. ఇక 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న ఫ్రాన్స్లో ఏఐ సమ్మిట్ జరగనుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్లు విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు.