మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం జగన్ ఇస్తారని నమ్మకంగా చెప్పిన చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై అనవసరంగా నోరు పారేసుకోవద్దని ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చారు. ” సినిమా టికెట్ల ధరలపై వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని జీవోలో మార్పులు చేసే విధంగా జగన్ గారు నిర్ణయం తీసుకొంటామన్నారు.. అప్పటివరకు సినిమా రంగంలోని వారు సమన్వయం పాటించాలి. ఈ సందర్భంగా ఇండస్ట్రీ వాళ్ళకు నేను ఒకటి తెలియజేస్తున్నాను. ఇండస్ట్రీ పెద్దగా…
మరోసారి ఏపీ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్.. పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యానికి నిరసనగా నిర్వహించిన దీక్షలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ పోలీసులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. పోలీసులు పార్టీ కండువాలు వేసుకున్నారని మండిపడ్డారు.. వ్యవస్ధ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో వుండిపోయింది.. ఇక్కడ పరిస్ధితులను చక్కదిద్దేందుకు కేంద్రం చూస్తోందని.. అందుకే రీకాల్ చేస్తారని చెప్పానని.. అది త్వరలోనే జరుగుతుందని…
హైదరాబాద్లో ఉన్న నాబార్డ్ రీజనల్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తరలించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు రాసిన లేఖను… బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులుకు అందజేశారు. ముంబైలో గోవిందరాజులును కలిసి పాతూరి ఈ లేఖను స్వయంగా ఇచ్చారు. ఈ సందర్బంగా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పాతూరి కోరారు. అమరావతిలో ఇప్పటికే కేంద్రప్రభుత్వం నాబార్డుకోసం స్థలాన్ని కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.
అభివృద్ధిలో విద్య కీలక భూమిక పోషిస్తుందని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు.అమరావతిలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో వెబ్నార్ ద్వారా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెమ్ హస్పటల్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ సి. పలనివేలు, పద్మభూషణ్ డా. డి. నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే ఎక్కువ శస్త్ర చికిత్సలు చేసి వైద్యరంగానికి ఎనలేని సేవలందించిన డా. డి నాగేశ్వర్రెడ్డి, పళనివేలకు గౌరవ డాక్టరేట్ను…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఈ సారి లేఖలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు వ్యవహారాన్ని ప్రస్తావించారు.. పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్షలు విరమింపజేయాలని లేఖలో కోరిన ఆయన.. అందరికీ చట్టప్రకారం పునరావాసం కల్పించాలని కోరారు.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందరికీ ఇవ్వాలని కోరిన ఆయన.. సీఎం వైఎస్ జగన్ గతంలో ప్రకటించి రూ. 10 లక్షల ప్యాకేజీ…
మాజీ సీఎం, ఏపీలో విపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం ఢిల్లీ పర్యటన విజయవంతం అవుతుందని ఓర్వలేక చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ఏపీకి చేసిందేం లేదన్నారు ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈవెంట్ మేనేజ్ మెంట్ పేరుతో వందల కోట్లు వేస్ట్ చేశారన్నారు. మీలా డ్రామాలు చేయడం మాకు చేతకాదన్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్నారు.…
మూడు రాజధానుల చట్టాన్ని తాత్కాలికంగా వెనక్కు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు సీఆర్డీఏ పరిధిలోని నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా.. ఆగిపోయిన భవనాల నిర్మాణాలను ప్రారంభించింది. నిధుల సమీకరణకు తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది సీఆర్డీఏ. మూడు రాజధానుల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ చట్టంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రస్తుతమున్న మూడు చట్టాలను రద్దు చేశామని.. తిరిగి సమగ్రంగా కొత్తగా తీసుకొస్తామని స్పష్టం చేసింది…
ఏపీ రాజధానికి మరో హంగు రాబోతోంది. అమరావతి త్వరలో కార్పొరేషన్గా మారబోతోంది. రాజధానిలోని 19 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటుకానుంది. ఈమేరకు నోటిఫికేషన్ జారీ చేశారు గుంటూరు జిల్లా కలెక్టర్. దీనిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఏపీ రాజధాని అమరావతిని నగరపాలక సంస్థగా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ గా మార్చనుంది. రాజధానిలోని 19 గ్రామాలను ఈ కార్పొరేషన్ లో చేర్చనున్నారు. తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవడేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది నేతలు బెయిల్పై ఉన్నారని.. త్వరలో వారు మళ్లీ జైలుకు వెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన… ఏపీలోని కొందరు నేతలు బెయిలుపై ఉన్నారు.. త్వరలో జైలుకెళ్లే అవకాశం లేకపోలేదు అంటూ కామెంట్లు చేసి ఒక్కసారిగా రాజకీయాల్లో హీట్ పెంచారు… ఇక, నిధులు కేంద్రానివి.. స్టిక్కర్లు రాష్ట్రానివి.. ఏపీలో…
మరోసారి తెలుగుతమ్ముళ్లపై తీవ్ర స్థాయిలో కొడాలినాని విమర్శల బాణాలు ఎక్కు పెట్టారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ పై ధ్వజమెత్తారు. ఎవ్వరరూ ఏమనుకున్నా ఎన్ని కుట్రలు చేసినా మూడు రాజధానుల విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఆయన వెల్లడించారు. మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ చేపట్టామని ఆయన అన్నారు. విశాఖలో సచివాలయం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం ఖాయమని తెలిపారు. అమరావతి కూడా ఉంటుందని నాని వ్యాఖ్యానించారు. కేవలం…