హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి పని చేస్తున్న ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏప్రిల్ 30వ తేదీ అంటే ఇవాళ్టితో గతంలో పొడిగించిన సమయంలో ముగియడంతో.. మే 1 తేదీ నుంచి జూన్ 30 తేదీ వరకూ ఉచిత వసతి సదుపాయాన్ని పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సచివాలయం మహిళా ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీఓలు, ఏపీ…
ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు కరోనా నుంచి విముక్తి లభించినట్టేనా..? మహమ్మారి మాయం అయినట్టేనా? అంటే ఇప్పుడు సమాధానం చెప్పలేని ప్రశ్నే.. అయితే, ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది.. ఎందుకంటే..? ఈరోజు కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,163 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదు.. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు…
బీజేపీ ప్రజల నుంచి ఒంటరవుతోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మొన్నటి ఐదురాష్ట్రాల ఎన్నికల్లోనూ చావు తప్పి కన్నులొట్టబోయి బయట పడిందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు. రాబోయే కాలంలో మత పరంగా ప్రజలను విభజించి అధికారంలోకి రావాలని చూస్తోంది. శ్రీరామనవమి, హనుమాన్ జయంతిలను ఘర్షణలకు ఉపయోగించుకుంది. రాబోయే కాలంలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. లౌకిక శక్తులన్నీ కలిసొచ్చి మతోన్మాదానికి వ్యతిరేకంగా కలిసి రావాలన్నారు. బీజేపీ మతోన్మాద శక్తులకు…
ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది.. పాత మంత్రులతో జరిగిన చివరి కేబినెట్ సమావేశంలో.. అందరితో రాజీనామాలు చేయించిన సీఎం వైఎస్ జగన్.. పాత కొత్త మంత్రుల కలయికతో ఆదివారం రోజు తన కొత్త టీమ్ను ప్రకటించారు.. ఇక, ఇవాళ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. 25 మంది కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.. ప్రమాణ స్వీకార ఘట్టంలో మొదట సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రమాణ స్వీకారం…
ఢిల్లీలో కేంద్ర MSME శాఖామంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే ను కలిశారు అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు. అమరావతి లో “సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సంస్థ” కు ఐదు ఎకరాల భూమిని శాఖమూరు గ్రామంలో 60 సంవత్సరాల లీజుకు కేటాయించడమైనదని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ. 20.45 లక్షలు చెల్లించడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి పై స్పష్టమైన తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ…
ఏపీ సీఎం జగన్ తన మాటకు కట్టుబడి కొత్త జిల్లాలను ఏర్పాటుచేశారు. రేపటినుంచి కొత్తజిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నాం అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. అయితే వసతులు,సదుపాయాలు లేకుండా కొత్త జిల్లాల్ని ఏర్పాటుచేస్తే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. అమరావతి తరహాలో కొత్త జిల్లాలను చేయవద్దన్నారు. అమరావతి అభివృద్ధికి నిధులివ్వాలని కేంద్రాన్ని ఎందుకు అడగడంలేదన్నారు జీవీఎల్. 2019 ఎన్నికల్లో 26 జిల్లాల ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించాం. ఏపీలో…
ఏపీలో అమరావతి విషయంలో ప్రభుత్వం తీరుని బీజేపీ తప్పుపడుతూనే వుంది. అమరావతి రాజధాని రైతులకు ప్రభుత్వం ఒక షెడ్యూల్ ప్రకారం హామీలు అమలు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాజధాని పై హైకోర్టు తీర్పు అనంతరం సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారు.అఫిడవిట్ వివరాలు కోర్టు పరిధిలో ఉంటాయి. అయితే ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో ఇచ్చిన ప్లాట్లుకు పనులు పూర్తి చేసి ఇవ్వాలి.తగిన సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రాకపోవడంతో రైతులు ఆందోళన…
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై సీఎస్ సమీర్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్లో కీలక అంశాలు ప్రస్తావించారు.. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు 6 నెలలు కాదు.. 60 నెలలు కావాలని పేర్కొన్నారు.. రాజధాని ప్రాంతం నుంచి వెళ్లిపోయిన వర్కర్లు, యంత్రాలను రప్పించేందుకే రెండు నెలల సమయం అవసరమన్న ఆయన.. అమరావతిలో పనులు మొదలు పెట్టేందుకే 8 నెలల సమయం పడుతుందన్నారు.. రోడ్ల నిర్మాణం కోసం 16 నెలలు అవసరం అవుతుందని.. రోడ్ల పనులు పూర్తి చేశాక, డ్రైనేజి,…
కరోనా మహమ్మారి తర్వాత వివిధ రంగాలు క్రమంగా పుంజుకుంటున్నాయి.. కోవిడ్ అన్ని రంగాలపై ప్రభావం చూపించి.. ఆర్థికంగా దెబ్బ కొట్టగా.. మళ్లీ విభాగాల్లో ఆదాయం పెరుగుతోంది.. ఇక, ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది.. 2021వ సంవత్సరం ఊహించని మార్పులు రాగా.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆస్తి కొనుగోళ్లలో పెరుగుదలను చూసింది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ రూ. 7327 కోట్ల మేర రిజిస్ట్రేషన్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఖజానాకు ఆదాయం వచ్చింది.. 2021-22…
తెలుగు జాతి ఆత్మగౌరవ జెండాని ఢిల్లీ వీధుల్లో ఎగురేశారు స్వర్గీయ నందమూరి తారకరామారావు. నేడు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం. 1982 మార్చి 29న హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్సులో పార్టీ ప్రారంభించారు వెండితెర వేలుపు ఎన్టీఆర్. తెలుగుదేశం 40ఏళ్ల ప్రస్థానం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు అధినేత చంద్రబాబు.అమరావతి కేంద్రంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు నారా లోకేష్. సాయంత్రం 4గంటలకు…