CS Sameer Sharma Falls Sick: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో బ్యాంకు అధికారులతో సమీక్ష చేస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు.. వెంటనే ఆయన్ను అధికారులు ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్చారు.. అయితే, సమీర్ శర్మ గత నెలలో కూడా అస్వస్థతకు గురయ్యారు.. ఇటీవలే హైదరాబాద్లో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు.. ఆ తర్వాత దాదాపు వారం రోజుల నుంచి విధులకు…
CPI Narayana: విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ మహాసభల్లో అమరావతికి మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టారు. ఏపీకి అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు తీర్మానాన్ని 29 రాష్ట్రాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి సత్వరమే అమరావతి నిర్మాణం కొనసాగించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. 17…
ఆంధ్రప్రదేశ్లో వరుసగా రెండో ఏడాది ప్రతిష్టాత్మక అవార్డులు ప్రకటించారు.. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ 2022 అత్యున్నత పురస్కారాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు జీవీడీ కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డుల ప్రక్రియ చేపట్టింది.. సామాన్యుల్లో ఉన్న అసామాన్యులను గుర్తించి సత్కరించటం దీని ప్రధాన ఉద్దేశ్యం అన్నారు.. మన సంస్కృతి, సంప్రదాయాలను వైఎస్సార్ ఒక ప్రతీకగా నిలబడ్డారు.. ఇదే కోవలో సంస్కృతి, సంప్రదాయాలు,…
అమరావతి రైతుల పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది.. వారికి వ్యతిరేకంగా కార్యాచరణ కూడా సిద్ధం చేసింది జేఏసీ.. అయితే, పాదయాత్రపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు.. పాదయాత్రను కచ్చితంగా అడ్డుకుంటామని ప్రకటించారు.. మా కడుపు కొడతామంటే ఊరుకోవాలా? అని ప్రశ్నించిన ఆయన.. పాదయాత్ర ఆపేయాలని అడుగుతాం.. ఆపకపోతే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 15న నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన జరుగుతోంది.. టీడీపీ పాదయాత్ర పేరుతో మా…