Kottu Satyanarayana: అమరావతి ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధానుల వ్యవహారం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతూనే ఉంది… అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వం లక్ష్యం.. మూడు రాజధానులు ఏర్పాటు చేసితీరుతామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.. రాజు మారినప్పుడల్లా.. రాజధాని మారుతుందా? అని మండిపడుతున్నాయి.. అయితే, మూడు రాజధానులు అభివృద్ధి చేయాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల మద్దతు ఉందన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసన రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కానీ, రియల్ ఎస్టేట్ కోసం ప్రాంతాలు అభివృద్ధి చేయడం సరికాదని హితవుపలికారు.
Read Also: Dasara: దసరా ఉత్సవాల్లో విషాదం.. నృత్యం చేస్తూ యువకుడు, పాటలు పాడుతూ గాయకుడు మృతి
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అన్నారు కొట్టు సత్యనారాయణ.. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్న ఆయన.. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం నడుస్తుంది… ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా సంక్షేమ కార్యక్రమాల అమలు జరుగుతుంది.. ప్రస్తుత బడ్జెట్లో ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం దేశానికే ఆదర్శం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు భగవంతుడి ఆశీస్సులు, చిత్తశుద్ధి, సంకల్పం ఉన్నందువల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. కాగా, మూడు రాజధానుల విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. మరోవైపు.. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ.. అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే, అది రైతుల పాదయాత్ర కాదు.. కోటీశ్వరుల పాదయాత్ర అంటూ అధికార పక్షం మండిపడుతోంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!