Kottu Satyanarayana: అమరావతి ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధానుల వ్యవహారం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతూనే ఉంది… అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వం లక్ష్యం.. మూడు రాజధానులు ఏర్పాటు చేసితీరుతామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.. రాజు మారినప్పుడల్లా.. రాజధాని మారుతుందా? అని మండిపడుతున్నాయి.. అయితే, మూడు రాజధానులు అభివృద్ధి చేయాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల మద్దతు ఉందన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసన రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కానీ, రియల్ ఎస్టేట్ కోసం ప్రాంతాలు అభివృద్ధి చేయడం సరికాదని హితవుపలికారు.
Read Also: Dasara: దసరా ఉత్సవాల్లో విషాదం.. నృత్యం చేస్తూ యువకుడు, పాటలు పాడుతూ గాయకుడు మృతి
Also Read
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Heart Attack: డోన్లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అన్నారు కొట్టు సత్యనారాయణ.. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్న ఆయన.. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం నడుస్తుంది… ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా సంక్షేమ కార్యక్రమాల అమలు జరుగుతుంది.. ప్రస్తుత బడ్జెట్లో ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం దేశానికే ఆదర్శం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు భగవంతుడి ఆశీస్సులు, చిత్తశుద్ధి, సంకల్పం ఉన్నందువల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. కాగా, మూడు రాజధానుల విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. మరోవైపు.. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ.. అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే, అది రైతుల పాదయాత్ర కాదు.. కోటీశ్వరుల పాదయాత్ర అంటూ అధికార పక్షం మండిపడుతోంది.
తాజావార్తలు
-
Srikanth Odela: ‘దసరా’ కేజీఎఫ్ కాదన్న నిరాశను తుడిచేయడానికే నానితో ‘ప్యారడైజ్’..
-
H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
-
Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
-
Zodiac Signs : అదృష్టం తలుపు తట్టబోతోంది.. ఆ 4 రాశులేవో తెలుసా?
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!