Botsa Satyanarayana: రుషికొండలో సీఎం నివాసం కడితే తప్పేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మహాజ్ఞాని, యుగపురుషుడు, ప్రొఫెసర్….అందుకే మమ్మల్ని దద్దమ్మ అన్నాడు. అచ్చెన్నాయుడు మనిషి పెరిగాడు కానీ బుర్ర పెరగలేదు…మూడున్నరేళ్లలో ఉత్తరాంద్రకు ఏమి చేశారని అడుగుతున్న టీడీపీ నేతలు వాళ్ళు హయాంలో ఏం చేశారో చెప్పగలరా…? ఉత్తరాంద్ర అభివృద్ధి అంతా వైఎస్సార్ హయాంలోనే జరిగింది…175 స్థానాలు గెలుస్తాం….ఆ దిశగా మా ప్రణాళికలు ఎప్పుడు ఉంటాయి….జగన్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. విశాఖలో భూముల రికార్డులు మాయం చేసిన దౌర్భాగ్యులా…. మా గురించి మాట్లాడేది….? ఋషికొండలో చేపట్టిన నిర్మాణాలు సీఎం క్యాంప్ కార్యాలయం అని పరోక్షంగా చెప్పేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఋషికొండలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం కడితే తప్పేంటి.? అని బొత్స ప్రశ్నించారు.
Read Also: CM Jagan: డిసెంబర్ నాటికి 5 లక్షల ఇళ్ళు పూర్తిచేయాలి
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రావాల్సిందే…. అడ్డుకుంటే చరిత్ర హీనులు అవుతారు….పరిపాలన వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ రైతుల రూపంలో రావడం ఎందుకు…నేరుగా టీడీపీ కండువాలు కప్పుకుని రావొచ్చు కదా….!?రాజకీయాలు పలుచన కావడానికి నాయకుల వ్యవహారశైలి, మాట తీరే కారణం…అశోక్ గజపతి రాజు విజయనగరం అభివృద్ధికి ఏం చేశారో చెప్పగలరా…..!?మీ హయాంలో ఏం జరిగిందో చెప్పడానికి సిద్ధం….? ప్రజలకు తాగునీరు ఇచ్చే రామతీర్థం ప్రాజెక్ట్ ను అశోక్ గజపతి రాజు అడ్డుకున్నారు.
ఏపీ విభజన చట్టంలో ఉన్న యూనివర్శిటీ కూడా తెచ్చుకో లేకపోయారు. అమరావతిలో ఎందుకు కేపిటల్ వద్దో……విశాఖలో ఎందుకు కావాలో చెప్పడానికి నేను సిద్ధం. త్వరలోనే ఋషికొండ కు అఖిలపక్షం తీసుకెళ్లి చూపిస్తాం…అక్కడ ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ భవనాలు కడితే తప్పేంటి…? టీడీపీకి దురుద్దేశాలు తప్ప వాస్తవికత ఉండదు…. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిగా ఇప్పుడు ఉన్న నేతలు భావించడం లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
Read ALso: Ap Highcourt: స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నియామకాలు.. హైకోర్టు స్టే
తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి బొత్స….హరీష్ రావు ఒకసారి ఏపీకి వచ్చి ఇక్కడి టీచర్లతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలి. తెలంగాణ పీఆర్సీ.. ఆంధ్రా పీఆర్సీ పక్కపక్కన బెట్టి చూసుకుంటే అప్పుడు తేడా తెలుస్తుందన్నారు బొత్స. పరిశీలన లేకుండా ఎందుకు వచ్చిన మాటలు…మన దగ్గర ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారన్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?