Minister RK Roja: అది అమరావతి యాత్ర కాదు.. అత్యాశ యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి టు అరసవల్లి మహాపాదయాత్ర ఒకవైపు కొనసాగుతుంటే.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు యాత్రపై విమర్శల దాడి కొనసాగిస్తూనే వున్నారు. తాజాగా మంత్రి రోజా అమరావతి యాత్రపై తీవ్ర విమర్శలు చేశారు. తిరుమలలో మంత్రి రోజా మాట్లాడుతూ.. .మూడు ప్రాంతాల అభివృద్ది కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామన్నారు. 26 గ్రామాల కోసం 26 జిల్లాలను ఫణ్ణంగా పెట్టలేం అన్నారు. చంద్రబాబుకి అమరావతిపై ప్రేమ వుంటే ఐదేళ్ళ కాలంలో ఎందుకు అభివృద్ది చెయ్యలేదని ఆమె ప్రశ్నించారు.
ప్రశాంత నగరంలో గొడవలు సృష్టించి..రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు.మూడు రాజధానులు ఏర్పాటుతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చెయ్యాలని సీఎం జగన్ నిర్ణయించారన్నారు.టీడీపీ మద్దతుతోనే ఉత్తరాంధ్రలో రైతులు పాదయాత్ర చేస్తున్నారని..పాదయాత్రలో తొడలు గొట్టి…మీసాలు దువ్వుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు నిద్రలేచి ట్వీట్ ల ద్వారా ఏదో ఒక్క యాగీ చేస్తావుంటాడని..ఉత్తరాంధ్రలో ప్రజలు వలస పోతున్నారంటు ఆరోపణలు చేస్తున్నాడని మంత్రి రోజా అన్నారు. గతంలో ఆయన మిత్రపక్షంగా వున్నప్పుడు ప్రజలు వలసపోలేదా అన్ని పవన్ కళ్యాణ్ పై రోజా మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాకా ఉత్తరాంధ్రను ఎంతో అభివృద్ధి చేసాడని…రోజుకొక్క మాట…పూటకొక్క వేషం వేస్తూ తిరిగితే పవన్ కళ్యాణ్ ను ప్రజలు కొట్టే రోజూ త్వరలోనే వస్తుందని రోజా అన్నారు.
శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న రోజా వీఐసీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమరావతి వాళ్ళది రాజధాని యాత్ర కాదు…అత్యాశ యాత్ర అని మండిపడ్డారు. వైజాగ్ ప్రజలను రెచ్చగోట్టడానికే అమరావతి రైతులు అటు వైపు పాదయాత్ర చేస్తున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్లు అవగాహనరాహిత్యంతో చేస్తున్నవే అని ఆమె ఎద్దేవా చేశారు. ఇదిలా వుంటే.. వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూనే వున్నాయి.
Read Also: Pawan Kalyan: దేనికీ గర్జనలు? పవన్ పవర్ పంచ్ లు
రాజధానిపై రెఫరెండం కావాలంటే టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు మంత్రి అమర్నాథ్. తెలంగాణ ఉద్యమాన్ని కూడా ప్రస్తావించారు.. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసింది టీఆర్ఎస్.. కానీ, కాంగ్రెస్ కాదన్నారు.. అయితే, ఎన్నికలకు సరదా ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.. ఈ సమయంలో రాజీనామాలు చేయాల్సిన అవసరం లేనప్పటికీ ప్రజాభిప్రాయం తెలియజేయడానికి ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖ గర్జన ఉంటుందన్నారు మంత్రి అమర్నాథ్.. ఎల్.ఐ.సీ. కూడలి నుంచి చేపట్టే భారీ ప్రదర్శనలో అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగడతాం అన్నారు.
Read Also: Munugode Bypoll: మునుగోడులో టీడీపీ ఎంట్రీ.. పోటీపై త్వరలో క్లారిటీ..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!