Botsa Satyanarayana: వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో మూడురాజధానులపై మరోసారి తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో వికేంద్రీకరణ అంశాలు పెట్టాం.. 29 గ్రామాలు, ఒక ప్రాంతం, ఒక వర్గం కోసం ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. 2019 నాటికి లక్ష 9 వేలు కోట్లు రాజధానికి గత ప్రభుత్వం ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. శివరామకృష్ణన్ కమిటీ కి గత ప్రభుత్వం కో ఆపరేట్ చేయలేదు. ఆ కమిటీ గత ప్రభుత్వం నిర్ణయం సరైనది కాదని చెప్పిందన్నారు.
Read Also: football match: గాల్లోనే ఆటగాళ్ల గోల్స్.. 20వేల అడుగుల ఎత్తులో ఫుట్ బాల్ మ్యాచ్
Also Read
రాష్ట్ర సంపద ల్యాండ్ పూలింగ్ పేరుతో 29 గ్రామాల్లో పెట్టారు. ల్యాండ్ ఇచ్చిన వారికి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం చేస్తాము.. మనం కళ్ళు తెరిచే టైం కి రాష్ట్ర విభజన జరిగిపోయింది.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు,దొంగలు, దోపిడిదారులు పాద యాత్ర గా వస్తున్నారు.. రాష్ట్రంలో కుట్ర జరుగుతుంది..జరుగుతున్న దోపిడీని అడ్డుకోవాలి. చంద్రబాబు కి , లోకేష్ కి జై అని పాదయాత్ర మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రజలు కష్టాన్ని 29 గ్రామాల గోతులలో పోయాలి అంటున్నారు. తెలుగుదేశం ప్రజలు అభిమానం కోల్పోయిన పార్టీ, వారి ముసుగులో పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు మంత్రి బొత్స.
ఐదు కోట్ల ప్రజల పరిస్థితి ఏంటి? మన దేవుడి దగ్గరకి వచ్చి శాపాలు పెడతారా? ఇదెక్కడి చోద్యం. 29 గ్రామాలు రియల్ ఎస్టేట్ కోసం, ఒక పార్టీ మనుగడ కోసం యాత్ర చేస్తున్నారు. పాదయాత్ర కావాలంటే ఐదు నిమిషాలు చాలని కానీ అది సాంప్రదాయం కాదని చెప్తే నా మాటలు వక్రీకరించారు. ఇక్కడే రాజధాని కడతామని అగ్రిమెంట్ ఇవ్వలేదు. ఐదు కోట్ల ప్రజలు డబ్బులు ఆ మట్టి లో పోస్తే 29 గ్రామాల నుంచి మీరు సంపాదిస్తారా? రైతులు ముసుగులో టీ డీ పీ చేస్తున్న పాదయాత్ర కి బుద్ధి చెప్పాలన్నారు. పాదయాత్ర ఒక్క అడుగు ముందుకు వేయకుండా అడ్డుకోవాలి. దుష్ట శక్తులు, దుర్మార్గులు ను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మొహం పెట్టుకుని బీజేపీ నేతలు రాజధాని విశాఖ కి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. బీజేపీ నేతలు ద్వంద వైఖరి వహిస్తున్నారని దుయ్యబట్టారు మంత్రి బొత్స.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..