మహారాష్ట్రంలోని రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్కి మరోసారి షాక్ తగిలింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీనే నిజమైన పార్టీ అని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ స్పష్టం చేశారు.
NCP: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) పార్టీ వివాదంలో మరోసారి శరద్ పవార్కి షాక్ తగిలింది. నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్దే అని మహారాష్ట్ర స్పీకర్ స్పష్టం చేశారు. అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేది లేదని స్పీకర్ రాహుల్ నార్వేకర్ తేల్చి చెప్పాడు. అజిత్ పవార్ వర్గానికి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, శరద్ పవార్ వర్గానికి 12 మంది ఎమ్మెల్యేల వర్గం ఉందని ఆయన చెప్పారు.
మహారాష్ట్రలో రాజకీయం హీటెక్కింది. ఎన్సీపీ పార్టీలో చీలికతో శరద్ పవార్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని పార్టీని నిజమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Sharad Pawar:నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సంక్షోభం నేపథ్యంలో మంగళవారం ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్దే అని ప్రకటించి శరద్ పవార్కి షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ వర్గంలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం శరద్ పవార్ వర్గం కొత్త పేర్లు, ఎన్నికల గుర్తులను సూచించాలని కోరింది.
షనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న వివాదాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తిస్తున్నట్టు వెల్లడించింది. అసెంబ్లీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను కలిగిన అజిత్ పవార్ వర్గానికే పార్టీ చిహ్నం, గుర్తును ఈసీ కేటాయించింది.
Sharad Pawar : ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్ని నిజమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి)గా పరిగణించింది. ఎన్నికల సంఘం ఈ నిర్ణయం పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్కు పెద్ద దెబ్బ.
గతేడాది జూలై నెలలో మహారాష్ట్రలో రాజకీయంగా పెను దుమారం చెలరేగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ ఎమ్మెల్యేల బృందంతో కలిసి మహారాష్ట్రలో అధికార కూటమిలో చేరారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ కూడా ప్రమాణం చేశారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్లో నాయకత్వ అంశంపై చాలా ఏళ్లుగా చర్చ కొనసాగుతుంది. ఎప్పుడూ మాట్లాడని ఎంపీ సుప్రియా సూలే.. ఈ అంశంపై తొలిసారిగా బహిరంగంగా వ్యాఖ్యానించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్కు నాయకత్వం వహించడానికి తనకే ఎక్కువ అర్హత ఉందని ఆమె అన్నారు.
Ajit Pawar: ప్రస్తుతం దేశంలో ప్రధాని నరేంద్రమోడీకి ప్రత్యామ్నాయం లేదని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సోమవారం అన్నారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికలపై, ప్రతిపక్షాలు ప్రధాని మోడీని సవాల్ చేయాలనుకుంటున్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు.
Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీల్లో చీలికలు ఏర్పడ్డాయి. ఈ రెండు చీలిక వర్గాలు బీజేపీతో ప్రభుత్వాన్ని పంచుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ని కాదని అజిత్ పవార్ బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ తో పాటు శరత్ పవార్ నమ్మినబంట్లుగా పేరున్న నేతలు కూడా అజిత్ వర్గంలోనే ఉన్నారు. మెజారిటీ ఎమ్మెల్యే ఈ వర్గంతోనే జతకట్టారు.