Ajit Pawar: రాజ్యసభ బరిలో అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్..
- రాజ్యసభ బరిలో అజిత్ పవార్ భార్య..
- నామినేషన్ దాఖలు చేసిన సునేత్రా పవార్..
- బారామతి నుంచి ఓడిపోయిన సునేత్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar: ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ రాజ్యసభ బరిలో నిలిచారు. ఇటీవల మహారాష్ట్రలోని బారామతిలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేకి ప్రత్యర్థిగా నిలబడిన సునేత్రా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు రాజ్యసభ దారి ఎంచుకున్నారు. గురవారం రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎన్సీపీ అభ్యర్థిగా పత్రాలను దాఖలు చేశారు. ‘‘రాజ్యసభ ఎన్నికలకు సునేత్ర పవార్ను పోటీకి దింపాలని ఎన్సీపీ నిర్ణయించింది. నేను కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నాను, కానీ బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో పార్టీ నేతలు ఆమె పేరును ఖరారు చేశారు’’ అని రాష్ట్ర మంత్రి , సీనియర్ ఎన్సిపి నాయకుడు ఛగన్ భుజ్బల్ చెప్పారు.
Read Also: Bihar: విరిగిన కాలుకు ప్లాస్టర్ బదులుగా అట్టపెట్టె.. ఇదేం వైద్యం రా.. బాబు
Also Read
పార్టీ నిర్ణయాన్ని అంతా అంగీకరించాలి. కొన్ని నిర్భందాలు ఉన్నాయని నేను స్వతంత్రుడిని కాదని, పార్టీ నాయకుడిని, కార్యకర్తనని ఛగన్ భుజ్బల్ అన్నారు. రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేయనందుకు నిరాశ చెందారా..? అని ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ఇలా అన్నారు. రాజ్యసభ సెక్రటేరియట్ సభలో 10 ఖాళీలను నోటిఫై చేసింది. ఇందులో అస్సాం, బీహార్, మహారాష్ట్రలో రెండు స్థానాల చొప్పున, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపురలో ఒక్కొక్కటి ఉన్నాయి.
ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దారుణంగా దెబ్బతింది. మొత్తం 48 ఎంపీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో కేవలం 17 స్థానాలను మాత్రమే గెలిచింది. ఇందులో బీజేపీ 09, శివనేన షిండే 07, ఎన్సీపీ అజిత్ పవార్ 01 సీట్లను గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే ఇండియా కూటమి మాత్రం ఏకంగా 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ 13, శివసేన (ఉద్ధవ్) 09, ఎన్సీపీ శరద్ పవార్ 08 సీట్లను గెలుచుకున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!