NCP: అజిత్ పవార్ ఎన్సీపీలో కలవరం.. శరద్ పవార్కి టచ్లో 10-15 ఎమ్మెల్యేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCP: మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘోరపరాజయం ఆ కూటమిలోని పార్టీలకు ఇబ్బందికరంగా మారాయి.ముఖ్యంగా ఎన్సీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ శిబిరంతో టచ్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, వీటిని అజిత్ పవార్ వర్గం కొట్టిపారేసింది. లోక్సభ ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం కేవలం ఒకే ఎంపీ సీట్లు దక్కించుకుంది. అయితే, శరద్ పవార్ వర్గం ఏకంగా 08 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి.
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
అజిత్ పవార్ వర్గానికి చెందిన పలువురు నేతలు తమతో టచ్లో ఉన్నట్లు ఎన్సీపీ(శరద్ పవార్) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ అన్నారు. మహారాష్ట్రలో గందరగోళం మధ్య అసంతృప్త నేతలను శాంతింపచేయడానికి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంత్రివర్గం విస్తరణ చేయవచ్చనే సమచారం ఉంది. ఈ ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం 04 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తే కేవలం 01 స్థానాన్ని గెలుచుకుంది. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ బారామతి లోక్సభ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే చేతిలో 1.5 లక్షల ఓట్లతో ఓడిపోయారు. మరోవైపు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(శివసేన-ఉద్దవ్, ఎన్సీపీ-శరద్ పవార్, కాంగ్రెస్) కూటమి ఏకంగా 48 సీట్లలో 30 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 13 స్థానాలను గెలుచుకుంది.
గతేడాది ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటుతో పార్టీ రెండు ముక్కలైంది. అయితే, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెనక ఉండటంతో ఆ పార్టీ గుర్తు ఆయనకే దక్కింది. దీంతో శరద్ పవార్ వేరే ఎన్సీపీ చిన్న వర్గానికి నాయకుడిగా మిగిలారు. పార్టీలో చీలిక అనంతరం అజిత్ పవార్ ఎన్డీయే కూటమితో చేరారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఒక్క ఎన్సీపీలోనే కాదు, బీజేపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. బీజేపీ కేవలం 09 ఎంపీ సీట్లను గెలుచుకోవడంతో, ఈ ఫలితాలపై ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వ పదవిని వీడాలనుకుంటున్నారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!