NCP: అజిత్ పవార్ ఎన్సీపీలో కలవరం.. శరద్ పవార్కి టచ్లో 10-15 ఎమ్మెల్యేలు..
NCP: మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘోరపరాజయం ఆ కూటమిలోని పార్టీలకు ఇబ్బందికరంగా మారాయి.ముఖ్యంగా ఎన్సీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ శిబిరంతో టచ్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, వీటిని అజిత్ పవార్ వర్గం కొట్టిపారేసింది. లోక్సభ ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం కేవలం ఒకే ఎంపీ సీట్లు దక్కించుకుంది. అయితే, శరద్ పవార్ వర్గం ఏకంగా 08 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి.
Also Read
- Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
- Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
- Raghav Chadha: ఆప్లో భారీ చీలిక.. పంజాబ్లో 'మాన్' ప్రభుత్వం కూలిపోతుందా!
- Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
అజిత్ పవార్ వర్గానికి చెందిన పలువురు నేతలు తమతో టచ్లో ఉన్నట్లు ఎన్సీపీ(శరద్ పవార్) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ అన్నారు. మహారాష్ట్రలో గందరగోళం మధ్య అసంతృప్త నేతలను శాంతింపచేయడానికి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంత్రివర్గం విస్తరణ చేయవచ్చనే సమచారం ఉంది. ఈ ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం 04 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తే కేవలం 01 స్థానాన్ని గెలుచుకుంది. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ బారామతి లోక్సభ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే చేతిలో 1.5 లక్షల ఓట్లతో ఓడిపోయారు. మరోవైపు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(శివసేన-ఉద్దవ్, ఎన్సీపీ-శరద్ పవార్, కాంగ్రెస్) కూటమి ఏకంగా 48 సీట్లలో 30 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 13 స్థానాలను గెలుచుకుంది.
గతేడాది ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటుతో పార్టీ రెండు ముక్కలైంది. అయితే, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెనక ఉండటంతో ఆ పార్టీ గుర్తు ఆయనకే దక్కింది. దీంతో శరద్ పవార్ వేరే ఎన్సీపీ చిన్న వర్గానికి నాయకుడిగా మిగిలారు. పార్టీలో చీలిక అనంతరం అజిత్ పవార్ ఎన్డీయే కూటమితో చేరారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఒక్క ఎన్సీపీలోనే కాదు, బీజేపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. బీజేపీ కేవలం 09 ఎంపీ సీట్లను గెలుచుకోవడంతో, ఈ ఫలితాలపై ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వ పదవిని వీడాలనుకుంటున్నారు.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!