Sharad Pawar vs Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. NCP అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడంతో.. ఆయన భార్య సునేత్రా పవార్ను ఉప ముఖ్యమంత్రిగా నియమించే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారన్న ప్రచారంపై సీనియర్ నేత శరద్ పవార్ స్పందించారు. సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా…
Sunetra Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా రేపు సాయంత్రం 5 గంటలకు అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. ఈ రోజు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో ఎన్సీపీ నేతలు సమావేశమయ్యారు. సునేత్రా పవార్కు అత్యున్నత పదవి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.
అజిత్ పవార్ అకాల మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. ఇక ఎన్సీపీని ముందుండి నడిపించేది ఎవరు? అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఎన్సీపీ శాసనసభా పక్ష సమావేశం అవుతోంది.
Story Board: అజిత్ పవార్ కేవలం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మాత్రమే అయితే ఇంత చర్చ అనవసరం లేదు. కానీ ఆయన ఎన్సీపీకి అధినేతగా కూడా ఉన్నారు. అలాగే ఎవరేమనుకున్నా.. పవార్ కుటుంబ రాజకీయానికి కూడా కేంద్ర బిందువుగా ఉన్నారు.
అజిత్ పవార్ విమాన ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు బృందాలు శోధిస్తున్నాయి. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం కీలక సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తోంది.
దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ గ్రౌండ్లో అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు తరలివచ్చారు.
బారామతి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు సహాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ దుర్ఘటన దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసింది.
Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఈరోజు (బుధవారం) ఉదయం విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆయన ముంబై నుంచి బారామతికి లియర్జెట్ 45 విమానంలో వెళ్లారు. అయితే, ల్యాండింగ్కు కొన్ని క్షణాల ముందు రన్ వేకు పక్కనే విమానం క్రాష్ ల్యాండ్ అయింది. వెంటనే పెద్ద మంటలు చెలరేగి అందులో ఉన్న ఐదుగురు మరణించారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణించిన చార్టర్డ్ విమానం ‘లియర్ జెట్ 45’ (Learjet 45) బొంబార్డియర్ సంస్థకు చెందినది. ఈ సంస్థ తయారుచేసే గ్లోబల్ సిరీస్, ఛాలెంజర్ సిరీస్ విమానాలు ప్రపంచవ్యాప్తంగా విలాసానికి, వేగానికి మారుపేరు. అందుకే ప్రపంచంలోని అత్యంత ధనవంతులు తమ ప్రయాణాల కోసం ఈ జెట్లనే ఎంచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ తారలు , రాజకీయ నాయకులు బొంబార్డియర్ విమానాలను సొంతంగా కలిగి ఉన్నారు లేదా లీజుకు తీసుకుని…
ముంబై నుంచి బారామతికి బయలుదేరిన అజిత్ పవార్ విమానం ఉదయం 8:45 – 9:15 గంటల మధ్య ప్రమాదానికి గురైంది. బారామతి విమానాశ్రయ రన్వేపై దిగడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్వేకు బదులుగా సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లి భూమిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం ముక్కలుగా విరిగిపోవడంతో పాటు భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు…