BAN vs PAK: పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్లో మరో వివాదం.. వైడ్ బాల్కి రివ్యూ, ఐసీసీకి ఫిర్యాదు!
- పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్లో మరో వివాదం
- క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా వైడ్ బాల్ రివ్యూ
- ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాకిస్థాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఢాకా వేదికగా ఆదివారం పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మూడో వన్డేలో వివాదం చోటుచేసుకుంది. మ్యాచ్ చివరి ఓవర్లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంపైర్ తీసుకున్న నిర్ణయం, దానిపై బంగ్లాదేశ్ జట్టు తీసుకున్న రివ్యూ కారణంగా రెండు జట్ల మధ్య వివాదం తలెత్తింది. ఇప్పటికే ఈ సిరీస్లోని రెండో వన్డే మ్యాచ్లో పాక్ బ్యాటర్ సల్మాన్ అలీ అఘా రనౌట్ తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
పాకిస్తాన్ విజయానికి చివరి ఓవర్లో 14 రన్స్ అవసరం అయ్యాయి. ఆ ఓవర్ను బంగ్లా స్పిన్నర్ రిషాద్ వేశాడు. తొలి రెండు బంతులకు రిషాద్ పరుగులు ఇవ్వలేదు. మూడో బంతికి రెండు రన్స్ వచ్చాయి. నాలుగో బంతికి పరుగేమీ రాలేదు. ఐదో బాల్ని రిషాద్ లెగ్ సాధించగా.. బంతిని షాహీన్ ఆఫ్రిది డౌన్ ది లెగ్ ఆడటానికి ప్రయత్నించాడు. షాట్ కనక్ట్ కాలేదు. దీంతో ఫీల్డ్ అంపైర్ వైడ్గా ప్రకటించాడు. వికెట్ కీపర్ లిట్టన్ దాస్ సూచన మేరకు బంగ్లా కెప్టెన్ రివ్యూ తీసుకున్నాడు. ఇక్కడే వివాదం చోటు చేసుకుంది.
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
Also Read: Sanju Samson: ఇన్స్పిరేషన్ నుంచి ఫేవరెట్ మూవీ వరకు.. సంజు రాపిడ్ ఫైర్ సమాధానాలు ఇవే!
రివ్యూలో బంతి వైడ్ కాదని, సరైన బంతేనని థర్డ్ అంపైర్ తేల్చాడు. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ ప్లేయర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బంగ్లా ఆటగాళ్లు మైదానంలోని బిగ్ స్క్రీన్పై రీప్లే చూసిన తర్వాతే.. రివ్యూకి వెళ్లారని పాక్ ఆరోపించింది. ఫీల్డ్ అంపైర్ నిర్ణయం అనంతరం 15 సెకన్లలోపే డీఆర్ఎస్ కోరాలని, నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కూడా రివ్యూకు అంపైర్ అనుమతించడంపై పాక్ అసహనం వ్యక్తం చేసింది. ఇది మ్యాచ్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఈ విషయంపై ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వివాదంపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!