Maharashtra Budget: ముందుగానే ప్రజలకు ఎన్నికల తాయిలాలు.. బడ్జెట్ అంతా వరాలే
- మహారాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బడ్జెట్ వరాలు
- ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు
- రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం మహారాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భారీగా తాయిలాలు ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీగా నష్టపోయింది. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో డీలా పడింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలే లక్ష్యంగా బడ్జెట్ ప్రకటనలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది.
బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవే..
‘‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్’’ పథకం కింద 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలకు నెలకు రూ.1,500 అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఇక 10 లక్షల మంది ఇంటర్న్లకు నెలకు రూ.10,000 స్టైఫండ్ అందించే పథకాన్ని కూడా ప్రకటించారు. పంట నష్టానికి పరిహారంగా చెల్లించాల్సిన గరిష్ట మొత్తం రూ. 50,000కి పెంచారు. ఆవు పాల రైతులకు లీటర్కు రూ.5 సబ్సిడీ ఇస్తామని వెల్లడించారు. అంతేకాకుండా 44 లక్షల మంది రైతులకు విద్యుత్ బిల్లు బకాయిలు మాఫీ చేస్తామని రాష్ట్ర అసెంబ్లీలో అజిత్ పవార్ ప్రకటించారు. దీంతో పాటు ముంబై ప్రాంతంలో పెట్రోల్పై పన్నును 26 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అంటే పెట్రోల్ ధరలు లీటరుకు 65 పైసలు తగ్గుతాయి. ఇక డీజిల్పై పన్నును 24 శాతం నుంచి 21 శాతానికి పన్ను తగ్గించారు. దీంతో ముంబై ప్రాంతంలో డీజిల్ ధర లీటర్కు రూ.2 తగ్గుతాయని ఆయన తెలిపారు. అలాగే పేద కుటుంబాలకు ప్రతి సంవత్సరం మూడు ఉచిత ఎల్పిజి సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
Also Read
- EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీకి కేంద్రం ఆమోదం.. ఎంత శాతం? జమ ఎప్పుడంటే..?
- Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం.. కాంగ్రెస్కు షాక్, ఎన్డీయే అభ్యర్థి విజయం
- PM Modi: ఈ ఏడాది భారత్-యూరప్ సంబంధాలు బలపడ్డాయి.. వివాటెక్ ఈవెంట్లో పాల్గొన్న మోడీ
- Ranchi RSS attack: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి ఎన్కౌంటర్, గాయాలు..
అక్టోబర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇంకోవైపు ఇండియా కూటమి నేతలకు కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మరీ మహారాష్ట్ర ప్రజలు ఎవరికి అధికారం కట్టబెడతారో చూడాలి.
తాజావార్తలు
-
Hormuz: 3 నెలల తర్వాత సాఫీగా వాణిజ్య నౌకలు ప్రయాణం.. ఫొటోలు వైరల్
-
Wife Kills Husband: ఇన్స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
-
EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీకి కేంద్రం ఆమోదం.. ఎంత శాతం? జమ ఎప్పుడంటే..?
-
Pakistan Cricket Board: పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు..
-
Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మాకు సంబంధం లేదు.. దక్షిణ లెబనాన్పై చర్యలు కొనసాగుతాయన్న ఇజ్రాయెల్
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..