RSS: మహారాష్ట్రలో బీజేపీ ఫలితాలకు అజిత్ పవార్ ఎన్సీపీనే కారణం.. ఆర్ఎస్ఎస్ విమర్శలు..
- మహారాష్ట్రలో బీజేపీ వైఫల్యానికి అజిత్ పవార్ ఎన్సీపీనే కారణం..
- ఆర్ఎస్ఎస్ పత్రికలో బీజేపీపై విమర్శలు..
- శివసేనలా ఎన్సీపీతో బీజేపీ పొత్తు సహజమైనది కాదంటూ చురకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS: మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎన్డీయే కూటమికి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ముఖ్యంగా బీజేపీకి సొంతగా మెజారిటీ రాకపోవడానికి పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఘోరమైన ప్రదర్శనకు అజిత్ పవార్ ఎన్సీపీనే కారణమని ఆర్ఎస్ఎస్ విమర్శించింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ మరాఠీ వారపత్రికలో ‘కార్యకర్త ఖచ్లేలనాహి, తార్ సంభ్రమత్’ (కార్యకర్త నిరుత్సాహపడడు, కానీ గందరగోళానికి గురవుతాడు) హెడ్లైన్లో ‘వివేక్’ పత్రికలో కథనం వచ్చింది. బీజేపీకి, పార్టీ కార్యకర్తలకు మధ్య కమ్యూనికేషన్ లేకపోవడంతోనే కాషాయ పార్టీ పేలవమైన ఎన్నికల ప్రదర్శనను చేసినట్లు పత్రికలో ఆరోపించింది. అంతకుముందు ఆర్ఎస్ఎస్కి చెందిన మ్యాగజైన్ ‘ ఆర్గనైజన్ ’ లో లోక్సభ ఎన్నికల్లో అతివిశ్వాసం బీజేపీ దెబ్బతీసిందని, బీజేపీ నాయకులు-కార్యకర్తలు రియాలిటీ చెక్ చేసుకోవాలని సూచించింది.
ప్రస్తుతం వివేక్ కథనంలో.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకి చెందిన శివసేనతో బీజేపీ పొత్తు సహజమైనదిగా రాష్ట్రప్రజలు అంగీకరించారని, అయితే అజిత్ పవార్ ఎన్సీపీతో జట్టుకట్టడం వ్యతిరేకమైందని చెప్పింది. దాదాపు ప్రతీ కార్యకర్త లోక్సభ ఎన్నికల వైఫల్యం వెనక కారణాలను గురించి మాట్లాడుతూ, తమ అసంతృప్తిని వివరించారని, ఇందుకు ఎన్సీపీతో పొత్తు కారణమని చెప్పారని, బీజేపీ కార్యకర్తలు ఎన్సీపీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోందని చెప్పింది.
Also Read
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
- Bihar: ఇన్స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
- Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
Read Also: Venkaiah Naidu: రేవంత్ రెడ్డిని మెచ్చుకున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు..ఎందుకంటే..
మొత్తం 48 ఎంపీ సీట్లు ఉన్న మహారాష్ట్రలో ‘మహాయుతి’ కూటమి కింద బీజేపీ, ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి. మహాయుతి కేవలం 17 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇందులో బీజేపీ 28 సీట్లలో పోటీ చేస్తే కేవలం 09 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఎన్సీపీ ఒకటి, శివసేన(షిండే) 07 స్థానాల్లో విజయం సాధించింది. 2019లో బీజేపీ సొంతగా 23 ఎంపీలను గెలిచింది. మరోవైపు కాంగ్రెస్-శివసేన(ఉద్ధవ్)- ఎన్సీపీ(శరద్ పవార్)ల కూటమి ‘‘ మహా వికాస్ అఘాడీ’’ ఏకంగా 30 స్థానాలను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పోటీ చేసిన 17 స్థానాల్లో 13 స్థానాలను గెలుచుకుంది.
షిండే శివసేనతో బీజేపీ పొత్తు సహజమైనదని పేర్కొంటూనే, ఎన్సీపీ అజిత్ పవార్తో జత కట్టడాన్ని తప్పుపట్టింది. కార్యకర్తల నుంచి నాయకులను తయారుచేసే పార్టీ బీజేపీ అని, ఇప్పుడు అది తారుమారైందని కార్యకర్తలు భావిస్తున్నారని ఆర్ఎస్ఎస్ పత్రిక కథనం పేర్కొంది. బీజేపీని విమర్శిస్తూ ప్రతిపక్షాలు చేసిన ‘‘వాషింగ్ మెషిన్’’ నిందల్ని ప్రస్తావిస్తూ, హిందుత్వ వాదులు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు చెప్పింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఒంటెద్దు పోకడల్ని విమర్శిస్తోంది. ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ బీజేపీ పనితీరుకు ‘‘అహంకారం’’ కారణమని, అదే కారణంగా రాముడు 241 సీట్ల వద్దే ఆగిపోయేలా చేశాడని అన్నారు.
- Tags
- Ajit Pawar
- bjp
- Maharashtra
- NCP
- RSS
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!