Ajit Pawar: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది..
- స్థానిక.. పౌర ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తాం..
- బీజేపీలో ఎన్సీపీ పొత్తుపై అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar: ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహాయుతి కూటమిలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, శివసేన(ఏక్ నాథ్ షిండే), ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలు పొత్తులో ఉన్నాయి. అయితే, ఆదివారం అజిత్ పవార్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర స్థానిక, పౌర సంస్థల ఎన్నికల్లో తన పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని చెప్పారు. “ఎన్సీపీ లోక్సభ ఎన్నికలలో మహాయుతి మిత్రపక్షాలతో కలిసి పోరాడింది. పార్టీ తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మిత్రపక్షాలతో కలిసి పోరాడుతుంది. అయితే, మేము పౌర మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేస్తాము,” అని ఆయన కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
Read Also: Reel Turns Tragic: రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. ఉరి బిగుసుకుని 11 ఏళ్ల బాలుడి మృతి
Also Read
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
ఇటీవల ఎన్సీపీకి పట్టున్న పింప్రి-చించ్వాడ్ లోని అజిత్ పవార్ వర్గం నుంచి పలువురు నేతలు శరద్ పవార్ వర్గంలోకి మారిన తర్వాత అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎన్సీపీ గెలుపు కోసం కేవలం అసెంబ్లీ ఎన్నికలకే కాకుండా స్థానిక, పౌర సంస్థల ఎన్నికలకు కూడా సన్నద్ధం కావాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. జూలై 2023లో శరద్ పవార్ వర్గం నుంచి అజిత్ పవార్ బయటకు వచ్చారు. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరి, ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటోంది.
ఇదిలా ఉంటే శుక్రవారం రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే మాట్లాడుతూ..బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాబోయే స్థానిక, పౌర సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఓటర్లకు మరింత చేరువ కావాలని పార్టీ కార్యకర్తల్ని కోరారు. మహారాష్ట్రలో 27 మున్సిపల్ కార్పొరేషన్లు, 25 జిల్లా పరిషత్లు, రెండు మున్సిపాలిటీలకు దాదాపు రెండేళ్లుగా ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయి.
- Tags
- Ajit Pawar
- bjp
- Maharashtra
- NCP
తాజావార్తలు
-
Husband Suicide: ‘‘నా చేయి పట్టుకున్న భార్యే నన్ను చంపింది’’.. సూసైడ్ వీడియోలో భర్త ఆవేదన
-
Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
-
Durandhar 2 Review: ఓటీటీలోకి ‘ధురంధర్: ద రివెంజ్’.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
-
Peddi : వేట షురూ.. ‘రాంబుజ్జి’గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
-
Bhojshala Case: “భోజ్శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!