Modi Cabinet: అజిత్ పవార్కి మోడీ షాక్.. కేబినెట్లో దక్కని చోటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi Cabinet: మరికొన్ని గంటల్లో ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఇలా ప్రధానిగా బాధ్యతలు చేపడుతూ మోడీ రికార్డ్ సృష్టించారు. ఈ సారి ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాలకు మోడీ కేబినెట్లో సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇప్పటికే మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన ఇలా ఎన్డీయే మిత్రపక్షాలకు కేబినెట్లో చోటు దక్కింది.
ఇదిలా ఉంటే అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి మాత్రం భారీ షాక్ తగిలింది. ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీకి లోక్సభ ఎన్నికల్లో కేవలం ఒకే సీటులో గెలిచింది. ఆ పార్టీ తరుపున సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ గెలిచారు. అయితే, ప్రఫుల్ పటేల్కి మోడీ కేబినెట్లో చోటు దక్కుతుందని అంతా భావించినప్పటికీ, ఆయనకు సహాయమంత్రి పదవి మాత్రమే ఇచ్చేందుకు బీజేపీ మొగ్గు చూపింది.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: Modi 3.0 Cabinet: స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ రాణేలకు కేబినెట్లో దక్కని చోటు..?
ఇదిలా ఉంటే ఈ పరిణామంపై ప్రఫుల్ పటేల్ తన అనాసక్తిని బహిరంగంగా తెలిపారు. గతంలో తాను కేంద్రమంత్రిగా పనిచేశానని, సహాయమంత్రి పదవి దక్కడం తన పదవిని తగ్గించడమే అని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీకి చెప్పామని , కొన్ని రోజులు ఆగాలని కోరినట్లు చెప్పారు. దీనిపై అజిత్ పవార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తమకు ఒక లోక్సభ, రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఉన్నారని, రాబోయే 2-3 నెలల్లో రాజ్యసభలో 3 మంది సభ్యులు వస్తారని మొత్తం ఎంపీల సంఖ్య 4 అవుతుందని, తమకు కేబినెట్ మంత్రిత్వ శాఖ ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇస్తామని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
ఎన్డీయే పెట్టుకున్న రూల్ ప్రకారం.. ఎవరైనా పార్టీ అధ్యక్షుడిగా ఉండీ, ఎంపీగా గెలుపొందిన వారికి కేబినెట్ పదవి ఇవ్వడం లేదా 10 మంది ఎంపీలు ఉన్నవారికి ఒక కేబినెట్ మంత్రితో పాటు ఒక సహాయమంత్రి పదవి ఇవ్వాలని ఒక ఫార్మూలా రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ విషయంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అజిత్ పవార్ మహారాష్ట్రలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ పార్టీ నుంచి కేవలం ప్రఫుల్ పటేల్ మాత్రమే గెలవడంతో సహాయమంత్రిని ఆఫర్ చేసినట్లు తెలిసింది.
తాజావార్తలు
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!