Modi Cabinet: అజిత్ పవార్కి మోడీ షాక్.. కేబినెట్లో దక్కని చోటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi Cabinet: మరికొన్ని గంటల్లో ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఇలా ప్రధానిగా బాధ్యతలు చేపడుతూ మోడీ రికార్డ్ సృష్టించారు. ఈ సారి ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాలకు మోడీ కేబినెట్లో సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇప్పటికే మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన ఇలా ఎన్డీయే మిత్రపక్షాలకు కేబినెట్లో చోటు దక్కింది.
ఇదిలా ఉంటే అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి మాత్రం భారీ షాక్ తగిలింది. ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీకి లోక్సభ ఎన్నికల్లో కేవలం ఒకే సీటులో గెలిచింది. ఆ పార్టీ తరుపున సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ గెలిచారు. అయితే, ప్రఫుల్ పటేల్కి మోడీ కేబినెట్లో చోటు దక్కుతుందని అంతా భావించినప్పటికీ, ఆయనకు సహాయమంత్రి పదవి మాత్రమే ఇచ్చేందుకు బీజేపీ మొగ్గు చూపింది.
Also Read
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
Read Also: Modi 3.0 Cabinet: స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ రాణేలకు కేబినెట్లో దక్కని చోటు..?
ఇదిలా ఉంటే ఈ పరిణామంపై ప్రఫుల్ పటేల్ తన అనాసక్తిని బహిరంగంగా తెలిపారు. గతంలో తాను కేంద్రమంత్రిగా పనిచేశానని, సహాయమంత్రి పదవి దక్కడం తన పదవిని తగ్గించడమే అని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీకి చెప్పామని , కొన్ని రోజులు ఆగాలని కోరినట్లు చెప్పారు. దీనిపై అజిత్ పవార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తమకు ఒక లోక్సభ, రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఉన్నారని, రాబోయే 2-3 నెలల్లో రాజ్యసభలో 3 మంది సభ్యులు వస్తారని మొత్తం ఎంపీల సంఖ్య 4 అవుతుందని, తమకు కేబినెట్ మంత్రిత్వ శాఖ ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇస్తామని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
ఎన్డీయే పెట్టుకున్న రూల్ ప్రకారం.. ఎవరైనా పార్టీ అధ్యక్షుడిగా ఉండీ, ఎంపీగా గెలుపొందిన వారికి కేబినెట్ పదవి ఇవ్వడం లేదా 10 మంది ఎంపీలు ఉన్నవారికి ఒక కేబినెట్ మంత్రితో పాటు ఒక సహాయమంత్రి పదవి ఇవ్వాలని ఒక ఫార్మూలా రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ విషయంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అజిత్ పవార్ మహారాష్ట్రలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ పార్టీ నుంచి కేవలం ప్రఫుల్ పటేల్ మాత్రమే గెలవడంతో సహాయమంత్రిని ఆఫర్ చేసినట్లు తెలిసింది.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!