హాలీవుడ్ సినిమాల్ని రిలీజ్ చేయడానికి ముందు, కొన్ని ప్రధాన నగరాల్లో ప్రివ్యూస్ వేస్తారు. పది లేదా నెల రోజుల వ్యవధిలో ప్రివ్యూ షోస్ వేయడం జరుగుతుంది. తమ సినిమాలకు మరింత బజ్ తెచ్చుకునేందుకే ఈ స్ట్రాటజీ. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని తన ‘మేజర్’ సినిమాకి అడివి శేష్ అనుసరిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఉండే జనాల్లోకి తీసుకువెళ్ళడం కోసం.. ప్రీవ్యూస్ వేసేందుకు రెడీ అయ్యాడు. 9 ప్రధాన నగరాల్లో వేయనున్న ఈ ప్రివ్యూ స్క్రీనింగ్.. మే 24వ తేదీ నుంచి…
తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లను అమాంతం పెంచేయడం వల్ల, సాధారణ ఆడియన్స్ థియేటర్లకు రావడం చాలావరకు తగ్గించేశారు. ఈ దెబ్బకు.. కలెక్షన్ల పరంగా చాలా చిత్రాలు ప్రభావితం అయ్యాయి. చాలా థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇది గమనించిన మన మేకర్స్.. టికెట్ రేట్ల విషయమై తలొగ్గుతున్నారు. ఆల్రెడీ ఎఫ్3 సినిమాకు సాధారణ టికెట్ రేట్లే పెడుతున్నామని నిర్మాత దిల్రాజు ప్రకటించేశారు. ఇప్పుడు మేజర్ సినిమాకీ సాధరణ రేట్లకే టికెట్లు అందుబాటులో ఉంటాయని హీరో అడివి శేష్…
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఇంకా చాలామందే ఉన్నారు. గత రెండేళ్ల కాలంలో ఎంతోమంది స్టార్లు పెళ్లి పీటలు ఎక్కారు. ఇక నిన్నటికి నిన్న యంగ్ హీరో ఆది పినిశెట్టి కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. దీంతో టాలీవుడ్ బ్యాచిలర్స్ ను పెళ్లెప్పుడు అని అడగడం కామన్ అయిపోయింది. వారు కూడా ఇప్పుడే పెళ్లి ఏంటి అనో, సీనియర్స్ వున్నారు కదండీ వాళ్ల తరువాతే నేను అనేస్తున్నారు. ఇక యంగ్ హీరో అడివి శేష్ అయితే…
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో జూన్ 3న విడుదల కాబోతోంది. ఇటీవల ప్రచార పర్వాన్ని వేగవంతం చేశారు దర్శక నిర్మాతలు అందులో భాగంగా బుధవారం సాయంత్రం ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘ఓహ్ ఇషా’ అనే పాట రిలికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఒక గెట్ టు గెదర్ లో ఆర్మీ అధికారులు…
వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకుంది. జూన్ 3న ఈ చిత్రాన్ని ఈ రెండు భాషలతో పాటు మలయాళంలోనూ డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా అతని…
తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసుకున్న యువ హీరోల్లో అడివి శేష్ ఒకడు. ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ, ప్రేక్షకుల మదిలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు త్వరలోనే ‘మేజర్’గా మన ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న శేష్.. సినిమాకి సంబంధించిన విశేషాలతో పాటు కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న కొన్ని పరాభావాల్ని చెప్పుకొచ్చాడు. చందమామ సినిమాలో ముందుగా హీరోగా తననే తీసుకున్నారని, నవదీప్ స్థానంలో తాను ఉండాల్సిందని శేష్…
విభిన్నమైన కథలను ఎంచుకొని టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. ఇక తాజాగా ఆయన నటించిన చిత్రం ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం…
తెలుగు చిత్రసీమలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా సినిమాల్లో ‘మేజర్’ ఒకటి. 2008 ముంబై దాడులో అమరవీరుడైన మేజర్ ఉన్నికృష్ణన్ నిజ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో టైటిల్ రోల్లో అడివి శేష్ నటిస్తుండగా.. సాయి కిరణ్ తిక్క రచనా దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోన్న తరుణంలో.. మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ట్రైలర్ని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. రేపు (మే 9వ…
కెరీర్ మొదటి నుంచి వైవిధ్యంగా ముందుకు సాగుతూ.. కథా బలమున్న సినిమాలు చేస్తు.. వరుస విజయాలు అందుకుంటున్నాడు యంగ్ హీరో అడివి శేష్. ఈ టాలెంటెడ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ‘మేజర్’. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా.. ఈ సినిమా రూపొందుతోంది. అడివి శేష్ చిత్రాల్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతోంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో.. మహేష్ బాబు సొంత ప్రొడక్షన్ హౌస్..…