Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
- Metaకు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ
- 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meta $567 million fine: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ Metaకు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. యువత, పిల్లలపై సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల వల్ల కలిగిన నష్టాలను పరిష్కరించేందుకు $567 మిలియన్ చెల్లించాలని న్యూ మెక్సికో కోర్టు ఆదేశించింది. పిల్లల మానసిక ఆరోగ్యం, చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్కు సంబంధించిన అంశాలపై జరిగిన కీలక విచారణలో భాగంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
$420 మిలియన్లు యువత చికిత్సకు
గురువారం వెలువడిన తీర్పులో జడ్జి బ్రయాన్ బీడ్షీడ్ మొత్తం $567 మిలియన్లలో $420 మిలియన్లను యువతకు చికిత్సా సేవల కోసం కేటాయించాలని ఆదేశించారు. మిగిలిన మొత్తాన్ని వచ్చే ఐదేళ్లలో అవగాహన, నివారణ కార్యక్రమాలు, స్క్రీనింగ్ సేవలు, ఇతర సంబంధిత ఖర్చుల కోసం వినియోగించనున్నారు.
Also Read
- Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
- Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
గతంలోనే $375 మిలియన్ల సివిల్ పెనాల్టీ
ఈ కేసులో మొదటి దశ విచారణ మార్చిలో జరిగింది. అప్పట్లో జ్యూరీ Meta $375 మిలియన్ల సివిల్ పెనాల్టీ చెల్లించాలని ఆదేశించింది. పిల్లల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా కంపెనీ ప్లాట్ఫారమ్లు పనిచేస్తున్నాయని తెలిసినా Meta దానిని కొనసాగించిందని, అలాగే తన ప్లాట్ఫారమ్లలో పిల్లల లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టిందని జ్యూరీ అభిప్రాయపడింది.
Metaపై మరిన్ని మార్పుల కోసం ప్రాసిక్యూటర్ల డిమాండ్
రెండో దశ విచారణలో ప్రాసిక్యూటర్లు Meta కార్యకలాపాల్లో మరిన్ని మార్పులు చేయాలని కోరారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వినియోగదారులను ఎక్కువసేపు ఉంచే వ్యసనపూరిత ఫీచర్లను నియంత్రించడం, వయస్సు ధృవీకరణ వ్యవస్థలను బలోపేతం చేయడం, పిల్లల కోసం డిఫాల్ట్ ప్రైవసీ రక్షణలను పెంచడం వంటి చర్యలను కోరారు. అయితే, 13 ఏళ్లలోపు పిల్లల కోసం కొన్ని వయస్సు ధృవీకరణ పద్ధతులను అమలు చేయడంపై ఫెడరల్ చైల్డ్ ప్రైవసీ చట్టాలు పరిమితులు విధిస్తున్నాయని కోర్టు పేర్కొంది.
COPPA చట్టం కీలకం
Children’s Online Privacy Protection Act (COPPA) ప్రకారం 13 ఏళ్లలోపు పిల్లల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని తప్పనిసరిగా సేకరించడం లేదా వయస్సు నిర్ధారణ కోసం వారిని ఆన్లైన్లో నిష్క్రియాత్మకంగా ట్రాక్ చేయడం వంటి చర్యలకు పరిమితులు ఉన్నాయి. అలాగే Meta ఒక్క సంస్థకే వయస్సు ధృవీకరణ చర్యలను తప్పనిసరి చేయడం, ఇతర సోషల్ మీడియా కంపెనీలకు అదే నిబంధనలు వర్తించకపోవడం అన్యాయంగా ఉంటుందని, కంపెనీకి అధిక నష్టం కలిగించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.
భారత్లోనూ Metaపై ప్రభుత్వ ప్రశ్నలు
అమెరికాలో కోర్టు తీర్పు వెలువడిన సమయంలోనే భారత్లో కూడా Metaపై ప్రభుత్వ స్థాయిలో ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ కంటెంట్ రికమండేషన్ అల్గారిథమ్లు, భారత చట్టాల అమలు, హానికరమైన ఆన్లైన్ కంటెంట్ను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై భారత ప్రభుత్వ అధికారులు Meta ప్రతినిధులను వరుసగా రెండో రోజు ప్రశ్నించారు. సుమారు గంటపాటు జరిగిన సమావేశంలో Meta ప్రతినిధులు “తీవ్రమైన సమస్యలు” ఉన్నాయని అంగీకరించి, వాటిని పరిష్కరించేందుకు నిరంతర చర్యలు తీసుకుంటామని ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో Meta ప్రతినిధుల భేటీ
Meta గ్లోబల్ అఫైర్స్ హెడ్ జోయెల్ కప్లాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వరుసగా రెండో రోజు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిసింది. ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ఓ ఫేస్బుక్ పోస్ట్ను తాత్కాలికంగా పరిమితం చేసిన ఘటన తర్వాత ప్రభుత్వం Meta ప్రతినిధులను వివరణ కోసం పిలిచింది. గురువారం జరిగిన చర్చల్లో భారత చట్టాలను Meta ఎంతవరకు పాటిస్తోంది, దాని అల్గారిథమ్లు ఎలా పనిచేస్తున్నాయి, రాజ్యాంగపరమైన, చట్టపరమైన అవసరాలను తీర్చేందుకు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటోంది వంటి అంశాలపై అధికారులు ప్రశ్నలు అడిగారు.
CSAM, డీప్ఫేక్స్పై Meta వివరణ
ప్రభుత్వ వర్గాల ప్రకారం, డీప్ఫేక్స్, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (CSAM), బాట్ అకౌంట్లు, ఇతర సింథటిక్ కంటెంట్ వంటి సమస్యలను పరిష్కరించేందుకు Meta తీవ్రంగా పనిచేస్తోందని తెలిపింది. Meta ప్లాట్ఫారమ్ల సాంకేతిక అంశాలు కూడా చర్చల్లో ప్రధానంగా నిలిచాయి. తమ అల్గారిథమ్ల నిష్పాక్షికతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగించే విధానాలు, పారామీటర్లను కంపెనీ అధికారులు ప్రభుత్వానికి వివరించినట్లు సమాచారం.
మరో మూడు, నాలుగు రోజుల పాటు చర్చలు
Meta, భారత ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. తదుపరి దశలో ప్రధానంగా సాంకేతిక అంశాలపై చర్చలు జరగనున్నాయి. Metaకు చెందిన టెక్నికల్ ఎగ్జిక్యూటివ్లు భారత ప్రభుత్వ సాంకేతిక అధికారులతో సమావేశం కానున్నారు. ఐటీ సెక్రటరీ ఎస్. కృష్ణన్ ఈ చర్చలకు నాయకత్వం వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమెరికాలో పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన కేసులో భారీ ఆర్థిక బాధ్యతను ఎదుర్కొంటున్న Metaకు, భారత్లోనూ అల్గారిథమ్లు, CSAM, డీప్ఫేక్స్, బాట్ అకౌంట్లు, చట్టాల అమలుపై ప్రభుత్వ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
తాజావార్తలు
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!