యంగ్ హీరో అడవి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో అడివి శేష్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషించాడు. విషాదకరమైన 26/11 ముంబై దాడులలో ప్రజల ప్రాణాలను కాపాడడంలో తన ప్రాణాలను కోల్పోయిన అమరవీరుడు సందీప్ ఉన్నికృష్ణన్ ను స్మరించుకుంటూ ఆయన తల్లిదండ్రులు కె ఉన్నికృష్ణన్, ధనలక్ష్మి ఉన్నికృష్ణన్ సమక్షంలో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఈరోజు సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు తమ ప్రియమైన…
టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మేజర్’. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ‘మేజర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం కొత్త విడుదల తేదీ గురించి మేకర్స్ ఈ రోజు అధికారిక ప్రకటన చేశారు. ‘మేజర్’ చిత్రం 2022 ఫిబ్రవరి 11న తెలుగు, మలయాళం, హిందీ…
అడివి శేష్ హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ “మేజర్”. 2008లో జరిగిన ముంబై దాడిలో అమరవీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇంకా నిర్మాణాంతర దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ నుంచి ఇటీవల అనారోగ్యం కారణంగా అడివి శేష్ విరామం తీసుకున్నాడు. తాజాగా సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా అడివి శేష్ ఎమోషనల్ పోస్ట్ చేస్తూ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. “‘మేజర్’ సందీప్…
యంగ్ హీరో అడవి శేష్ డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. సెప్టెంబర్ నెలలో అడివి శేష్ ను డెంగ్యూ కారణంగా హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య బాగా పడిపోయింది. దీంతో సెప్టెంబర్ 18 న అడివి శేష్ ను ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. తాజాగా డబుల్ ఎనర్జీతో జిమ్ లో వర్కౌట్లు…
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత వారం అడివి శేష్కు డెంగ్యూ సోకినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆయన రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా పడిపోయాయట. దీంతో అడివి శేష్ సెప్టెంబర్ 18న ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోంది. శేష్ ఆరోగ్యానికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా అధికారికంగా ప్రకటించబడుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. విషయం తెలుసుకున్న సినిమా ప్రముఖులు,…
సినిమా వాళ్ళు సున్నిత మనస్కులు. చిన్న సంఘటన జరిగినా త్వరగా చెలించిపోతారు. కానీ అలాంటి సినిమా వాళ్ళే ఒక్కోసారి తమ ముందే అతి పెద్ద దారుణం జరిగినా స్పందించారు. ఆ కోవకు తాను చెందనని అంటున్నాడు అడివి శేష్. గత కొన్ని రోజులుగా ఆఫ్ఠనిస్థాన్ లో తాలిబన్లు చేస్తున్న దారుణ మారణ కాండను తెలియచేసే ఓ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి… ఆ లేఖ తన హృదయాన్ని బ్రద్దలు చేసిందని పేర్కొన్నాడు అడివి శేష్.…
యాక్షన్ థ్రిల్లర్ “గూఢచారి” థియేటర్లలో విడుదలై నేటితో సరిగ్గా మూడు సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమాలో హీరోగా నటించిన అడివి శేష్ తన ట్విట్టర్ లో “ఈ రోజుతో గూఢచారికి మూడేళ్లు. నాకు అత్యంత ఇష్టమైన చిత్రం. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే సినిమా ఇది. ఆగస్టు ఎల్లప్పుడూ నాకు అదృష్ట మాసం కాబట్టి, ఈ నెల చివరిలో నెక్స్ట్ మిషన్ భారీ అప్డేట్! #జి2 ప్రకటన త్వరలో వస్తుంది!” అంటూ ట్వీట్ చేశారు. అడివి శేష్…
అడవి శేష్ ‘మేజర్’ సినిమాకు హిందీలో బంపర్ ఆఫర్ తగిలింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు క్రేజీ ఆఫర్ వచ్చింది. సాటిలైట్ రైట్స్ రూపంలో కోట్లు కొల్లగొట్టింది ‘మేజర్’ సినిమా.అడవి శేష్ టైటిల్ రోల్ లో తెరకెక్కుతోన్న ‘మేజర్’ మూవీ అమర జవాన్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందింది. ఆయన ‘26/11’ ముంబై ఉగ్ర దాడుల్లో దేశాన్ని రక్షిస్తూ ప్రాణ త్యాగం చేశాడు. మేజర్ ఉన్నికృష్ణన్ గా శేష్…
అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా ‘మేజర్’. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని తొలుత జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ప్రస్తుతం కరోనా…
అడివి శేష్ హీరోగా నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘మేజర్’. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ తొంభై శాతం పూర్తయింది. అడివి శేష్ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘మేజర్’ సినిమాకి శేష్ స్క్రిప్ట్ అందిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ తిరిగి జూలైలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ, ”’మేజర్’ సినిమా షూటింగ్ను తిరిగి స్టార్ట్ చేయనున్నామని తెలియజేయేందుకు చాలా సంతోషిస్తున్నాను. గత ఏడాది చిట్కుల్ (హిమాచల్ప్రదేశ్లోని కిన్నూరు జిల్లాలో ఓ ప్రాంతం)లో ‘మేజర్’చిత్రీకరణ…