T20 World Cup: భారత్ ఒప్పుకోకపోతే.. అక్టోబర్ 23న పాక్ మ్యాచ్ ఆడదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamran Akmal Younis Khan Reacts To Jay Shah Comments On Asia Cup: వచ్చే ఏడాది ఆసియా కప్ వన్డే టోర్నీని పాకిస్తాన్ వేదికగా నిర్వహిస్తే.. టీమిండియా పాక్కు వెళ్లదని బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. తటస్థ వేదికపైనే నిర్వహిస్తామని, పాక్లో నిర్వహిస్తే మాత్రం భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టోర్నీలో పాల్గొనదని ఆయన తేల్చి చెప్పాడు. ఈ వ్యాఖ్యలు తమను తీవ్ర నిరాశకు గురి చేశాయని ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందించగా.. తాజాగా పాక్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, యూనిస్ ఖాన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక న్యూస్ ఛానెల్తో కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ.. ‘‘జై షా ఈ విధమైన ప్రకటన చేస్తారని ఊహించలేదు. చూస్తుంటే.. ఆయన కేవలం రాజకీయాలకే ఆయన పరిమితం అయినట్లు అనిపిస్తోంది. క్రీడల్లోకి రాజకీయాలను లాగాల్సిన పనిలేదు. ఒకవేళ వచ్చే ఏడాది ఆసియా కప్ టోర్నీని పాకిస్తాన్లో నిర్వహించకపోతే.. ఇకపై ఇండియాతో పాక్ ఎప్పుడూ ఆడబోదు. ఐసీసీ ఈవెంట్లలోనూ ఇండియాతో మ్యాచ్ ఆడదు. అసలు ఆసియా కప్ దాకా ఆగాల్సిన అవసరం లేదు.. టీ20 వరల్డ్కప్లో భాగంగా అక్టోబరు 23న నిర్వహించిన మ్యాచ్లోనూ ఇండియాతో పాక్ ఆడదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక యూనిస్ ఖాన్ స్పందిస్తూ.. ‘‘పాకిస్తాన్కు రాకూడదనే నిర్ణయానికి బీసీసీఐ కట్టుబడి ఉంటే.. పాక్ కూడా వచ్చే ఏడాది వన్డే వరల్డ్కప్ కోసం ఇండియాకు వెళ్లదు’’ అని పేర్కొన్నాడు.
Also Read
- Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
- Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
- Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
- T20 World Cup 2026: సెమీస్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ!
ఈ విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, పాక్ మాజీ ప్లేయర్లు చేసిన వ్యాఖ్యలపై మన టీమిండియా ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇండియాతో ఆడకపోతే నష్టపోయేది పాకిస్తాన్ జట్టేనని.. తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదని కౌంటర్ ఎటాక్కి దిగారు. కాగా.. టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా అక్టోబరు 23న భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలవనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తాజావార్తలు
-
AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం…
-
Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
-
Bathroom Cleaning Tips: కుళాయిలు, సింక్లు కొత్తవిగా మెరవాలంటే.. ఈ చిట్కాలతో నిమిషాల్లో కొత్త మెరుపు!
-
Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
-
December Clash : డిసెంబర్ లో బాలయ్య vs ప్రభాస్ టగ్ ఆఫ్ వార్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!