Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దంపతులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకుని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రి దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికారు. శ్రీవారి దర్శనానంతరం టీటీడీ తరపున ఛైర్మన్ సుబ్బారెడ్డి, కేంద్ర మంత్రికి జ్ఞాపికలు , స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రజాసేవ చేసే శక్తిని తనకు ప్రసాదించాలని కోరుకున్నట్లు చెప్పారు.
Also Read: Chandrayaan 3: చంద్రయాన్ -3 రిహార్సల్ లాంచ్ పూర్తి.. కౌంట్ డౌన్ షురూ
Also Read
ఇదిలా ఉండగా.. ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో నేడు గడ్కరీ భారీ సభలో పాల్గొననున్నారు. సభలో జాతీయ రహదారులను జాతికి అంకితం ఇవ్వనున్నారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం మదనపల్లెలో కేంద్ర మంత్రి పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు బీటీ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు కేంద్ర మంత్రి చేరుకోనున్నారు. మంత్రికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషా స్వాగతం పలకనున్నారు. అనంతరం సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని స్వాస్థ్య హాస్పిటల్ను నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు.
మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. స్వామి దర్శనానికి మొత్తం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం మొత్తంగా 72,664 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 32,336 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
తాజావార్తలు
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
-
Sharvari Wagh: షూటింగ్లో అలియాను చూసి ఎన్నో నేర్చుకున్నా: శార్వరీ
-
Ruturaj Gaikwad: ముగిసిన సీఎస్కే ప్రయాణం.. ధోనీ రిటైర్మెంట్పై CSK కెప్టెన్ సంచలన ప్రకటన..
-
US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
-
Dragon: ‘డ్రాగన్’లో..తారక్ పాత్రపై ప్రశాంత్ నీల్ బిగ్ క్లారిటీ..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!