Mahesh Goud: మంత్రివర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్
- టీపీసీసీ నేత మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు.
- కేసీఆర్ హయాంలో జరిగిన భూ అక్రమాలపై చర్చించేందుకు తాము సిద్ధం
- మూడేళ్లలో మేము అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నాడు
- మంత్రివర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Goud: తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన బీసీ రిజర్వేషన్లపై టీపీసీసీ నేత మహేష్ గౌడ్ స్పందించారు. రాహుల్ గాంధీ బీసీ గర్జనకు హాజరవుతారని కాంగ్రెస్ ఎప్పుడు ప్రకటించలేదని స్పష్టం చేశారు. వక్ఫ్ బిల్లుతో సంబంధం ఉన్న అంశాల కారణంగా రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపారు. అయితే, బీసీ రిజర్వేషన్ల అంశంపై రాహుల్ గాంధీ పూర్తి మద్దతు ఇస్తారని హామీ ఇచ్చారు. అలాగే హైదరాబాదులోని HCU భూములపై ఇటీవల జరుగుతున్న చర్చ పై కూడా ఆయన స్పందించారు. HCU భూములు ప్రభుత్వానికి చెందినవేనని, ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశమని ఆయన తెలిపారు. విద్యాసంస్థల అవసరాల కోసమే ఈ భూములను వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.
Read Also: MLC Nagababu: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి ఎమ్మెల్సీ నాగబాబు
Also Read
- Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
కేసీఆర్ హయాంలో జరిగిన భూ అక్రమాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అవి నిరూపించగలమని మహేష్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమణకు గురైన వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు హైడ్రా (HYDRA) తీసుకువచ్చామని వివరించారు. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్, బీజేపీ అడ్డుపడుతున్నాయని మహేష్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రెండు పార్టీలే ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
HCU భూముల నుంచే మై హోమ్కు వంద అడుగుల రోడ్డు అనుమతి ఎలా ఇచ్చారని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే ఎలా జరిగిందో తమకు అనుమానం ఉందని, దానిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. మూడేళ్లలో మేము అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నాడు అంటూ మహేష్ గౌడ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమకు తిరిగి అవకాశం కల్పిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం జరగాల్సిన మంత్రివర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా
-
Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
-
Shubman Gill: శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!