హైదరాబాద్ నల్లగండ్ల అపర్ణ సరోవర్లో విషాదం నెలకొంది. చదువుకోమని తండ్రి మందలించడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. చందానగర్ పీఎస్ పరిధిలోని నల్లగండ్ల అపర్ణ సరోవర్ సీ బ్లాక్ 14వ ఫ్లోర్లో అమిత్ కుటుంబం నివాసం ఉంటోంది. అమిత్ కుమారుడు అద్వైత్ (13) 8వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం అల్లరి చేస్తున్న విద్యార్థి అద్వైత్ను తండ్రి మందలించాడు. చదువుకోమని గట్టిగా అరిచాడు.
దీంతో మనస్తాపం చెందిన అద్వైత్… 14వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం యువకుడి మృతదేహాన్ని పోలీసులు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా తమకున్న ఒక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో అద్వైత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.