Summer Heat: వేసవిలో పెరుగుతున్న కడుపు ఇన్ఫెక్షన్లు.. ఈ లక్షణాల ఉంటే జాగ్రత్త..
Summer Heat: ఈ ఏడాది వేసవి కాలంలో ఎండల తీవ్రం గతంలో పోలిస్తే ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వేసవిలో కడుపులో ఇన్ఫెక్షన్లు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. డీ హైడ్రేషన్, లో బీపీ వంటి సమస్యల వంటి హెచ్చరికల్ని విస్మరించొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వేసవిలో చాలా మందికి గ్యాస్ట్రోఎంటెరిటిస్తో పాటు జ్వరం లక్షణాలు కనిపిస్తున్నాయి.
గ్యాస్ట్రోఎంటెరిటిస్ అనేది కడుపు మరియు ప్రేగులలోని లైనింగ్ వాపును సూచిస్తుంది. ఇది విరేచనాలు, వాంతులకు దారి తీస్తుంది. సాధారణంగా ఈ లక్షణాల కలయిక బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించొచ్చని వైద్యలు చెబుతున్నారు. ఇవి కొన్నిసార్లు తీవ్రమైన వైద్య పరిస్థితులకు దారి తీయవచ్చు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఇది అనారోగ్య కాలాన్ని పొడగించే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. న్యూఢిల్లీలోని ఆకాష్ హెల్త్కేర్లోని గ్యాస్ట్రోఎంటరాలజీ హెపటాలజీ & థెరప్యూటిక్ ఎండోస్కోపీ సీనియర్ కన్సల్టెంట్ & హెచ్ఓడి డాక్టర్ శరద్ మల్హోత్రా మాట్లాడుతూ.. వేసవిలో కడుపుకు సంబంధించి చాలా వ్యాధులు ఉంటాయి, వీటిలో గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని అన్నారు.
Also Read
- Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
- Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
Read Also: Amit shah Fake video Case: అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. మరో పీసీసీ అధ్యక్షుడికి సమన్లు..
ఈ ఆరోగ్య సమస్యలు కలుషిత ఆహారం, నీటికి సంబంధించినవి కావచ్చు లేదా వైరల్ మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించవచ్చు. వాతావరణ మార్పులు కూడా గ్యాస్ట్రిక్ అసాధారణతకు దారి తీస్తుందని వైద్యులు చెప్పారు. వేసవిలో తగినంత నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ జ్వరంతో పాటు గ్యాస్ట్రోఇంటెస్టినల్ వ్యాధులకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో అపరిశుభ్రత, పారిశుద్ధ్య సమస్యలు కూడా వ్యక్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చని వైద్యులు చెబుతున్నారు. తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో తీసుకోవాలని, పచ్చిగా ఉండే ఆహారం, తక్కువగా ఉడికించే ఆహారానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎండ వేడికి ఉండొద్దని, మద్యం వంటి డీహైడ్రేటింగ్ పానీయాల జోలికి వెళ్లొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కళ్లు మసకబారి పోవడం, పల్స్ పెరగడం, తక్కువ రక్తపోటు, పొడి నాలుక వంటి నిర్జలీకరణ సంకేతాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.స్పృహ కోల్పోవడం, పురీషనాళంలో రక్తస్రావం, నిరంతర అధిక-స్థాయి జ్వరం మరియు నిరంతర వాంతులు వంటి సందర్భాల్లో ఆసుపత్రిలో చేరాలని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!