Summer Heat: వేసవిలో పెరుగుతున్న కడుపు ఇన్ఫెక్షన్లు.. ఈ లక్షణాల ఉంటే జాగ్రత్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Summer Heat: ఈ ఏడాది వేసవి కాలంలో ఎండల తీవ్రం గతంలో పోలిస్తే ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వేసవిలో కడుపులో ఇన్ఫెక్షన్లు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. డీ హైడ్రేషన్, లో బీపీ వంటి సమస్యల వంటి హెచ్చరికల్ని విస్మరించొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వేసవిలో చాలా మందికి గ్యాస్ట్రోఎంటెరిటిస్తో పాటు జ్వరం లక్షణాలు కనిపిస్తున్నాయి.
గ్యాస్ట్రోఎంటెరిటిస్ అనేది కడుపు మరియు ప్రేగులలోని లైనింగ్ వాపును సూచిస్తుంది. ఇది విరేచనాలు, వాంతులకు దారి తీస్తుంది. సాధారణంగా ఈ లక్షణాల కలయిక బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించొచ్చని వైద్యలు చెబుతున్నారు. ఇవి కొన్నిసార్లు తీవ్రమైన వైద్య పరిస్థితులకు దారి తీయవచ్చు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఇది అనారోగ్య కాలాన్ని పొడగించే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. న్యూఢిల్లీలోని ఆకాష్ హెల్త్కేర్లోని గ్యాస్ట్రోఎంటరాలజీ హెపటాలజీ & థెరప్యూటిక్ ఎండోస్కోపీ సీనియర్ కన్సల్టెంట్ & హెచ్ఓడి డాక్టర్ శరద్ మల్హోత్రా మాట్లాడుతూ.. వేసవిలో కడుపుకు సంబంధించి చాలా వ్యాధులు ఉంటాయి, వీటిలో గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని అన్నారు.
Also Read
- Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే 'పెసర లడ్డూలు'.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
- Moringa Health Benefits: మునగను 'మిరాకిల్ ట్రీ' అని ఎందుకు అంటారు? కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
- Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్కు వెళ్లాలా.?
Read Also: Amit shah Fake video Case: అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. మరో పీసీసీ అధ్యక్షుడికి సమన్లు..
ఈ ఆరోగ్య సమస్యలు కలుషిత ఆహారం, నీటికి సంబంధించినవి కావచ్చు లేదా వైరల్ మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించవచ్చు. వాతావరణ మార్పులు కూడా గ్యాస్ట్రిక్ అసాధారణతకు దారి తీస్తుందని వైద్యులు చెప్పారు. వేసవిలో తగినంత నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ జ్వరంతో పాటు గ్యాస్ట్రోఇంటెస్టినల్ వ్యాధులకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో అపరిశుభ్రత, పారిశుద్ధ్య సమస్యలు కూడా వ్యక్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చని వైద్యులు చెబుతున్నారు. తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో తీసుకోవాలని, పచ్చిగా ఉండే ఆహారం, తక్కువగా ఉడికించే ఆహారానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎండ వేడికి ఉండొద్దని, మద్యం వంటి డీహైడ్రేటింగ్ పానీయాల జోలికి వెళ్లొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కళ్లు మసకబారి పోవడం, పల్స్ పెరగడం, తక్కువ రక్తపోటు, పొడి నాలుక వంటి నిర్జలీకరణ సంకేతాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.స్పృహ కోల్పోవడం, పురీషనాళంలో రక్తస్రావం, నిరంతర అధిక-స్థాయి జ్వరం మరియు నిరంతర వాంతులు వంటి సందర్భాల్లో ఆసుపత్రిలో చేరాలని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Anirudh : అనిరుథ్ – కావ్య మారన్ పెళ్లి.. కన్ఫర్మ్ చేసిన ఫ్యామిలీ మెంబర్
-
IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
-
Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు!
-
Sambarala Yeti Gattu: క్లైమాక్స్కు చేరుకున్న సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా మూవీ.. చివరి షెడ్యూల్తో భారీ అప్డేట్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!