Shashi Tharoor: మొదట ప్రధానిపై ప్రశంసలు.. ఇప్పుడు బీజేపీ ఎంపీతో సెల్ఫీ
- ఇటీవలే ప్రధానిపై మోదీని ప్రశంసించిన కాంగ్రెస్ నేత శశి థరూర్
- తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండాతో సెల్ఫీ
- ఫోటో సోషల్ మీడియాలో వైరల్.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండాతో కలిసి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు ప్రధాని మోదీని ప్రశంసించిన వ్యాఖ్యలు, ఈ ఫోటో శశి థరూర్ రాజకీయ భవిష్యత్తును మరింత ఉత్కంఠకరంగా మార్చాయి. ఢిల్లీలో ఇటీవల జరిగిన చర్చ సందర్భంగా శశి థరూర్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, భారతదేశం యొక్క దౌత్యంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరిని మొదట్లో తాను విమర్శించానని, అయితే మూడేళ్ల తర్వాత భారత్ వైఖరి చెల్లుబాటు అయిందని అన్నారు. భారత వైఖరిని విమర్శించి తాను ఒక మూర్ఖుడిలా మిగిలానని అన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే.. కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలను వ్యక్తిగత వ్యాఖ్యగా పేర్కొంది.
Read Also: UP: యూపీలో ఘోరం.. పెళ్లికి పిలవలేదని వరుడి తండ్రిపై పొరుగింటి వ్యక్తి కాల్పులు
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
మరోవైపు.. శశి థరూర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. “కాంగ్రెస్లో నాయకత్వం లేకపోవడం చాలా పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితిలో, పాకిస్తాన్తో పోరాటం చేయడం, కేరళలో మూడోసారి ప్రతిపక్షంలో కూర్చోవడం తప్పదు” అని అన్నారు. శశి థరూర్ తన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. “నా దగ్గర అనేక ఆప్షన్లు ఉన్నాయి. పార్టీ నన్ను ఉపయోగించుకోవాలనుకుంటే, నేను కాంగ్రెస్లోనే ఉంటాను. కానీ నాకు అనేక ఎంపికలు ఉన్నాయి,” అని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Purple Cap in IPL: ఐపీఎల్లో తొలిసారి పర్పుల్ క్యాప్ అందుకున్నది ఎవరో తెలుసా..? ఫుల్ లిస్ట్ ఇదే
తనకు కేరళలో మంచి గుర్తింపు ఉందని, స్వతంత్ర సర్వేలు కూడా తనను ముందున్న నాయకుడిగా చూపిస్తున్నాయని శశి థరూర్ పేర్కొన్నారు. “కేరళలో నేను ఇతర నాయకుల కంటే ముందున్నానని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, పార్టీలో నాయకత్వ మార్పులు ఉంటే, నేను దానికి ఒక ముఖ్యమైన భాగం అయ్యే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను,” అని ఆయన చెప్పారు. శశి థరూర్ ఈ వ్యాఖ్యలు, చర్చలు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడితో సెల్ఫీ దిగడం వంటి సంఘటనలు రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చలకు దారి తీస్తున్నాయి.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!