Shashi Tharoor: మొదట ప్రధానిపై ప్రశంసలు.. ఇప్పుడు బీజేపీ ఎంపీతో సెల్ఫీ
- ఇటీవలే ప్రధానిపై మోదీని ప్రశంసించిన కాంగ్రెస్ నేత శశి థరూర్
- తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండాతో సెల్ఫీ
- ఫోటో సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండాతో కలిసి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు ప్రధాని మోదీని ప్రశంసించిన వ్యాఖ్యలు, ఈ ఫోటో శశి థరూర్ రాజకీయ భవిష్యత్తును మరింత ఉత్కంఠకరంగా మార్చాయి. ఢిల్లీలో ఇటీవల జరిగిన చర్చ సందర్భంగా శశి థరూర్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, భారతదేశం యొక్క దౌత్యంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరిని మొదట్లో తాను విమర్శించానని, అయితే మూడేళ్ల తర్వాత భారత్ వైఖరి చెల్లుబాటు అయిందని అన్నారు. భారత వైఖరిని విమర్శించి తాను ఒక మూర్ఖుడిలా మిగిలానని అన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే.. కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలను వ్యక్తిగత వ్యాఖ్యగా పేర్కొంది.
Read Also: UP: యూపీలో ఘోరం.. పెళ్లికి పిలవలేదని వరుడి తండ్రిపై పొరుగింటి వ్యక్తి కాల్పులు
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
మరోవైపు.. శశి థరూర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. “కాంగ్రెస్లో నాయకత్వం లేకపోవడం చాలా పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితిలో, పాకిస్తాన్తో పోరాటం చేయడం, కేరళలో మూడోసారి ప్రతిపక్షంలో కూర్చోవడం తప్పదు” అని అన్నారు. శశి థరూర్ తన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. “నా దగ్గర అనేక ఆప్షన్లు ఉన్నాయి. పార్టీ నన్ను ఉపయోగించుకోవాలనుకుంటే, నేను కాంగ్రెస్లోనే ఉంటాను. కానీ నాకు అనేక ఎంపికలు ఉన్నాయి,” అని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Purple Cap in IPL: ఐపీఎల్లో తొలిసారి పర్పుల్ క్యాప్ అందుకున్నది ఎవరో తెలుసా..? ఫుల్ లిస్ట్ ఇదే
తనకు కేరళలో మంచి గుర్తింపు ఉందని, స్వతంత్ర సర్వేలు కూడా తనను ముందున్న నాయకుడిగా చూపిస్తున్నాయని శశి థరూర్ పేర్కొన్నారు. “కేరళలో నేను ఇతర నాయకుల కంటే ముందున్నానని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, పార్టీలో నాయకత్వ మార్పులు ఉంటే, నేను దానికి ఒక ముఖ్యమైన భాగం అయ్యే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను,” అని ఆయన చెప్పారు. శశి థరూర్ ఈ వ్యాఖ్యలు, చర్చలు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడితో సెల్ఫీ దిగడం వంటి సంఘటనలు రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చలకు దారి తీస్తున్నాయి.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?