Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Komaram Bheem Railway Connectivity From Kanyakumari To Kashmir Has Been Developed Kishan Reddy

Kishan Reddy: కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రైల్వే కనెక్టివిటీ అభివృద్ధి చేయబడింది..

NTV Telugu Twitter
Published Date :May 5, 2025 , 2:07 pm
By Chandra Shekhar
  • తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది..
  • మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోంది..
  • కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రైల్వే కనెక్టివిటీ అభివృద్ధి చేయబడింది: కిషన్ రెడ్డి
Kishan Reddy: కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రైల్వే కనెక్టివిటీ అభివృద్ధి చేయబడింది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kishan Reddy: కొమరంభీం జిల్లా సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోంది అన్నారు. అలాగే, కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు రైల్వే కనెక్టివిటీ అభివృద్ధి చేయబడింది.. దేశంలోని వెనుకబడిన ప్రాంతాలు, అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానించారు. ఇక, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో రూ.3,900 కోట్ల వ్యయంతో నిర్మించిన జాతీయ రహదారులను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించి జాతికి అంకితం చేశారని తెలిపారు. మోడీజీ ప్రభుత్వంలో నితిన్ గడ్కరీ నేతృత్వంలోని తెలంగాణలో 5 వేలకు పైగా కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు నిర్మించబడ్డాయని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.

Read Also: IPL : Dream11లో 4 కోట్లుగెలిచిన యువకుడు..!

అయితే, ఎక్స్‌ప్రెస్‌వేలు, అండర్‌పాస్ ల నిర్మాణంతో రోడ్డు రవాణా వ్యవస్థను సరళీకృతం అవుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రహదారుల అభివృద్ధితో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి, వాహనాల నడక సామర్థ్యం మెరుగుపడింది, చమురు వినియోగం తగ్గిందన్నారు. రోడ్, రైల్వే, ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీకి కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందన్నారు. అలాగే, ఆదిలాబాద్, జహీరాబాద్‌లలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేశారు.. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 7 మెగా టెక్స్‌టైల్ పార్కుల్లో ఒకటి తెలంగాణకు కేటాయించబడింది.. ఖాజీపేటలో రూ.800 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ మంజూరు చేశారు.. రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.12,000 కోట్లతో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు.. రూ.442 కోట్లతో రామగుండంలో 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: NANI : హిట్ 3.. డిస్ట్రిబ్యూటర్స్ కి డేంజర్ బెల్స్..

ఇక, ములుగు జిల్లాలో సమ్మక్క- సారక్క గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్‌లో కేంద్రీయ పసుపు బోర్డును ప్రారంభించాం.. ప్రధాని మోడీ చొరవతో రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చింది.. రూ.31,220 కోట్లతో రైల్వే లైన్లు, డబ్లింగ్ ప్రాజెక్టుల అమలు కొనసాగుతోంది.. రూ.1,25,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం, రూ.86,492 కోట్లతో కొత్త రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలు జరుగుతున్నాయి.. వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.. ఆదిలాబాద్‌లో డిఫెన్స్ ఎయిర్‌పోర్టు ప్రారంభానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దేశవ్యాప్తంగా 83 కోట్ల మందికి నెలకు 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందజేస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానిది.. పేదల కోసం సంవత్సరానికి రూ.5 లక్షల విలువైన ఉచిత వైద్య సేవల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తున్నారు.. దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ప్లానింగ్ కమిషన్ ద్వారా నిధులు విధుల చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరపున కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Kishan Reddy
  • nitin gadkari
  • PM Modi
  • Railway Connectivity

తాజావార్తలు

  • GT vs MI IPL 2025 Eliminator: క్వాలిఫయర్-2కి ముంబై.. ఇంటికి గుజరాత్‌..

  • Off The Record: అన్నా చెల్లెళ్ల పంతం ఎంతదాకా వెళ్తుంది..? ఈసారైనా రాఖీ పండుగ ఉంటుందా..?

  • Off The Record: వల్లభనేని వంశీ విడుదల ఎప్పుడు..? లైన్ లో ఇంకా కేసులు ఉన్నాయా..?

  • Off The Record: ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు.. జేసీ కామెంట్లతో టీడీపీ ఇరుకున పడుతుందా..?

  • Nigeria Floods: నైజీరియాను ముంచెత్తిన వరదలు.. 111 మంది మృతి

ట్రెండింగ్‌

  • Moto g86 Series: మోటొరోలా నుంచి మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G మూడు కొత్త 5G ఫోన్లు లాంచ్…!

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions