Pushkar Singh Dhami: ‘భారత రాష్ట్రపతి’ అనే పదాన్ని వాడడం దేశప్రజలకు గర్వకారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రాజధాని ఢిల్లీలో జరగనున్న జీ-20 సదస్సుకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఒకవైపు జీ-20కి ప్రస్తుత అధ్యక్షుడిగా భారత్ ఈసారి దీనిని నిర్వహిస్తోంది. మరోవైపు ‘ఇండియా’, ‘భారత్’ అనే పదాల విషయంలో దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది. జీ20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగే విందుకు పంపిన ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాసి ఉంది.
Reaad Also: MP Margani Bharat: చంద్రబాబు నాయుడు స్కామ్ లకే స్కామర్
Also Read
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ఒకవైపు ఇండియా అనే పదానికి బదులు భారత్ అనే పదాన్ని ఉపయోగించడంపై కాంగ్రెస్ సహా పలు విపక్షాలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. అదే సమయంలో బీజేపీకి చెందిన చాలా మంది నాయకులు ‘భారత్’ అనే పదానికి మద్దతు ఇస్తున్నారు. తాజాగా.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ‘భారత రాష్ట్రపతి’కి బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అనే పదాన్ని ఉపయోగించడాన్ని స్వాగతించారు. ఇది బానిస మనస్తత్వానికి తీవ్ర దెబ్బ అని అభివర్ణించారు.
Reaad Also: Weight loss Drinks: ఈ పానీయాలు తాగండి.. బరువు తగ్గండి
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి X (ట్విట్టర్)లో ‘బానిసత్వపు మనస్తత్వానికి మరో లోతైన దెబ్బ. G20 సమ్మిట్ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగే విందుకు ఆహ్వాన పత్రంపై “ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్” అని రాయడం దేశంలోని ప్రతి ఒక్కరికి గర్వకారణం. భారత్ మాతా కీ జై!’ అని రాశారు.
Reaad Also: Kalki2898AD: కల్కికి తప్పని లీకుల బెడద.. ప్రభాస్ లుక్ లీక్
ఒకవైపు బీజేపీ నేతలు ‘భారత రాష్ట్రపతి’ అనే పదాన్ని వాడడం దేశప్రజలకు గర్వకారణంగా పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు దీనిపై బీజేపీని టార్గెట్ చేస్తూ రాజ్యాంగాన్ని మార్చేందుకు కసరత్తు చేస్తున్నారని ఆరోపించారు. ఆహ్వాన పత్రికపై కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ స్పందిస్తూ.. ‘భారత రాష్ట్రపతి’ అంటూ ‘రాజ్యాంగాన్ని మార్చేంత వరకు వెళ్తారా?’ అని ప్రశ్నించారు. మరోవైపు బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యర్థి పార్టీలకు చిరాకు తెస్తోందని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు.
गुलामी की मानसिकता पर एक और गहरी चोट..
G20 समिट के दौरान राष्ट्रपति भवन में आयोजित होने वाले रात्रि भोज के निमंत्रण पत्र पर "The President of Bharat" लिखा जाना प्रत्येक देशवासी के लिए गौरव का क्षण है।
भारत माता की जय ! pic.twitter.com/IdAgHGRt36
— Pushkar Singh Dhami (@pushkardhami) September 5, 2023
తాజావార్తలు
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!