ఇటీవల టాలీవుడ్ అంటేనే నడుము అందాల ప్రదర్శన అని, దర్శకులు కేవలం హీరోయిన్ల శరీర భాగాలపైనే దృష్టి పెడతారని గతంలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తాప్సీ పన్ను మరోసారి అలాంటి కామెంట్స్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. తాజా ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. దక్షిణాది దర్శకులు హీరోయిన్లను ఆకర్షణీయంగా చూపించే క్రమంలో ‘ప్యాడెడ్ బ్రాలు’ ధరించమని ఒత్తిడి తెస్తారని, అది తనకు చాలా ఇబ్బందికరంగా అనిపించేదని చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో ‘క్లీవేజ్’ (Cleavage) పై దృష్టి పెడితే, సౌత్లో మాత్రం ‘నాభి’ (Navel) ప్రదర్శనపై ఫోకస్ చేస్తారని హేళనగా మాట్లాడింది. తన కామెంట్స్ పై తెలుగు ప్రేక్షకులు సినీ ప్రముఖులు ఆమెపై మండిపడ్డారు. దీంతో ఇప్పుడు ఆమె మాట మార్చడం చర్చనీయాంశంగా మారింది. చేసిన డ్యామేజ్ను కవర్ చేసుకునేందుకే ఆమె ఇప్పుడు తెలుగు సినిమాపై ప్రశంసలు కురిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read :Varanasi : ‘వారణాసి’ మేకింగ్ వీడియో.. రాజమౌళి విజన్కు ఫిదా అవుతున్న నెటిజన్లు!
ట్రోల్స్ సెగ తగిలిందో ఏమో కానీ, వెంటనే తాప్సీ తన రూటు మార్చింది. మరో ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ.. తనకు నటిగా గుర్తింపు తెచ్చింది తెలుగు సినిమాలేనని, తమిళం (కోలీవుడ్) కంటే తెలుగు ప్రేక్షకులు తనను ఎక్కువగా ఆదరించారని పొగడ్తలు కురిపించింది. దీంతొ సినిమా ప్రమోషన్ల కోసం వివాదాలు సృష్టించడం, ఆ తర్వాత యూటర్న్ తీసుకోవడం తాప్సీకి అలవాటేనని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు “ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న” అనే సామెత ఆమెకు సరిగ్గా సరిపోతుందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.