Ambedkar Statue : అమృత్సర్లో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం.. ఆప్ పై ప్రత్యర్థుల విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambedkar Statue : దేశమంతా గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటుండగా అమృత్సర్లో కొంతమంది వ్యక్తులు టౌన్ హాల్లోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీని తరువాత ఈ అంశంపై రాజకీయాలు ప్రారంభమయ్యాయి. బిజెపి నుండి కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ వరకు అందరూ దీనిని ఖండించారు. ఢిల్లీ కాంగ్రెస్ నాయకుడు, న్యూఢిల్లీ అభ్యర్థి సందీప్ దీక్షిత్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఇది చాలా తీవ్రమైన విషయం అన్నారు. జనవరి 26 వంటి రోజున కఠినమైన భద్రతా ఏర్పాట్లు ఉండాల్సి ఉంటుందని.. అలాంటి ఏర్పాటు లేవని స్పష్టంగా చూపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ భద్రత కల్పించామని చెబుతున్న పంజాబ్లో ఇది జరిగింది. ఇది చాలా విచారకరమైన సంఘటన దీనిని ఖండిస్తున్నామన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీపై దాడి చేస్తూ.. కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్, “నేను ఆమ్ ఆద్మీ పార్టీని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీ పోలీసులు ఎక్కడ ఉన్నారు?” అని అన్నారు. పంజాబ్ పోలీసులందరూ ఢిల్లీలో తిరుగుతున్నారని, వారు ఓట్ల కోసం ఇక్కడ తిరుగుతున్నారని ఆయన అన్నారు. నిన్న రాత్రి కూడా పంజాబ్ పోలీసులకు చెందిన రెండు వాహనాలను కనుగొన్నాము. ఢిల్లీలో ఎన్నికలలో పంజాబ్ పోలీసులందరినీ మోహరించినట్లయితే అక్కడ భద్రత ఉండకపోవడం సహజమన్నారు.
Also Read
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
Read Also:Gopi Chand : గోపీచంద్ కు బాలీవుడ్ లో గ్రాండ్ వెల్కమ్ దక్కుతుందా..?
కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్ కు బాబా సాహెబ్ పట్ల గౌరవం లేదన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఇండియా అలయన్స్ ప్రజలు రాజ్యాంగం, అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడుతారని, కానీ గణతంత్ర దినోత్సవం నాడు పంజాబ్లోని పోలీస్ స్టేషన్ ముందు పట్టపగలు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన తీరు ఇదేనని బిజెపి నాయకుడు షాజాద్ పూనావాలా అన్నారు.
పంజాబ్లోని అమృత్సర్లో జరిగిన ఈ సంఘటనను ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఖండించారు. సోషల్ మీడియా హ్యాండిల్ X లో పోస్ట్ చేస్తూ, శ్రీ అమృత్సర్ సాహిబ్ హెరిటేజ్ స్ట్రీట్లో బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ జీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన తీవ్రంగా ఖండించదగినదని.. ఈ సంఘటనకు ఎవరినీ క్షమించబోమని అన్నారు. ఈ సంఘటనకు పాల్పడిన వారికి అత్యంత కఠినమైన శిక్ష పడుతుంది. పంజాబ్ సోదరభావం, ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ఎవరినీ అనుమతించము. దీనిపై దర్యాప్తు చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పరిపాలనకు సూచనలు జారీ చేశారు. ఈ సంఘటన తర్వాత పంజాబ్ పోలీసులు రంగంలోకి దిగారు.
Read Also:Pregnancy Time: గర్భధారణ సమయంలో ఈ పండ్లు తింటున్నారా? తల్లి, బిడ్డలిద్దరికి డేంజరే!
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?