Pregnancy Time: గర్భధారణ సమయంలో ఈ పండ్లు తింటున్నారా? తల్లి, బిడ్డలిద్దరికి డేంజరే!
- గర్భధారణ సమయంలో మహిళలు తినే ఆహారంలో జాగ్రత్తలు తప్పనిసరి.
- పైనాపిల్, ద్రాక్ష, చింతపండు, పచ్చి బొప్పాయి, అరటిపండు విషయాలలో గర్భణీలు జాగ్రత్త.
Pregnancy Time: గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డలిద్దరికి ఆరోగ్యకరమైన ఆహారం అత్యంత ముఖ్యమైంది. కొన్ని పండ్లు సాధారణంగా ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడినా గర్భిణీ స్త్రీలు వాటిని తీసుకుంటే అవి హానికరంగా మారవచ్చు. ఈ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం ఎంతో జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే, కొన్ని పండ్లు గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని, బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలవు. ఇప్పుడు అలాంటి పండ్లి ఏంటో ఒకసారి తెలుసుకుందామా..
Also Read: Venkatesh Prasad: టాప్-5 భారతీయ క్రికెటర్లలలో కోహ్లీ, రోహిత్, ధోనిలకు దక్కని చోటు
Also Read
* గర్భధారణ సమయంలో పైనాపిల్ తినడం కేవలం పొరపాటుగా కూడా మంచిది కాదు. పైనాపిల్లో ఉన్న “బ్రోమెలైన్” అనే మూలకం గర్భస్రావాన్ని కలిగించవచ్చు. ఇది గర్భిణీ స్త్రీకి ఆరోగ్య సంబంధిత సమస్యలు కలిగించడమే కాకుండా బిడ్డకు కూడా హానికరం కలిగిస్తుంది కాబట్టి పైనాపిల్ను తినకుండా ఉండటం మంచిది.
* గర్భధారణ సమయంలో ద్రాక్షను ఎక్కువగా తినడం కూడా గర్భిణీ స్త్రీ, బిడ్డ ఆరోగ్యానికి హానికరం. ద్రాక్షలో “రెస్వెరాట్రాల్” అనే మూలకం ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో వైద్యుడి సలహా తీసుకుని మాత్రమే ద్రాక్ష తినడం మంచిది.
* గర్భధారణ సమయంలో చింతపండు తినడం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా మొదటి నాలుగు మాసాలలో చింతపండు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది గర్భస్రావానికి కారణమవుతుంది. ఈ కారణంగా గర్భిణీ స్త్రీలు చింతపండు తీసుకోవడం మానుకోవడం మంచిది.
Also Read: Whatsapp View Once: వాట్సాప్ యూజర్లకు షాక్.. ‘View Once’ ఫీచర్లో పెద్ద లోపం..
* ఇక అన్నిటికంటే ముఖ్యమైనది పచ్చి బొప్పాయి కూడా గర్భధారణ సమయంలో తినవద్దు. ఇందులో ఉన్న రబ్బరు పాలు గర్భానికి హానికరంగా ఉంటాయి. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా పచ్చి బొప్పాయిని తీసుకోవడం తగదు.
* అరటిపండు గర్భధారణ సమయంలో సర్వసాధారణంగా చాలా పోషకాలు అందిస్తుంది. కానీ, కొన్ని సందర్భాలలో ముఖ్యంగా మధుమేహం ఉన్న మహిళలు అరటిపండు తినడం మితంగా చేసుకోవాలి. అదేవిధంగా, అలెర్జీ సమస్య ఉన్న గర్భిణీ స్త్రీలు కూడా అరటిపండు తినడం సురక్షితం కాదు. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమైనది. కొన్ని పండ్లు, వాటిలో ఉండే రసాయనాల వల్ల గర్భధారణను నష్టపోవచ్చు. కాబట్టి, గర్భిణీ స్త్రీలు ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. వైద్యుడి సలహాతో ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి.
తాజావార్తలు
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో