Pregnancy Time: గర్భధారణ సమయంలో ఈ పండ్లు తింటున్నారా? తల్లి, బిడ్డలిద్దరికి డేంజరే!
- గర్భధారణ సమయంలో మహిళలు తినే ఆహారంలో జాగ్రత్తలు తప్పనిసరి.
- పైనాపిల్, ద్రాక్ష, చింతపండు, పచ్చి బొప్పాయి, అరటిపండు విషయాలలో గర్భణీలు జాగ్రత్త.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pregnancy Time: గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డలిద్దరికి ఆరోగ్యకరమైన ఆహారం అత్యంత ముఖ్యమైంది. కొన్ని పండ్లు సాధారణంగా ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడినా గర్భిణీ స్త్రీలు వాటిని తీసుకుంటే అవి హానికరంగా మారవచ్చు. ఈ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం ఎంతో జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే, కొన్ని పండ్లు గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని, బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలవు. ఇప్పుడు అలాంటి పండ్లి ఏంటో ఒకసారి తెలుసుకుందామా..
Also Read: Venkatesh Prasad: టాప్-5 భారతీయ క్రికెటర్లలలో కోహ్లీ, రోహిత్, ధోనిలకు దక్కని చోటు
Also Read
- OTR: మెదక్ జిల్లా కాంగ్రెస్ లో మళ్లీ బయటపడ్డ విబేధాలు
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
* గర్భధారణ సమయంలో పైనాపిల్ తినడం కేవలం పొరపాటుగా కూడా మంచిది కాదు. పైనాపిల్లో ఉన్న “బ్రోమెలైన్” అనే మూలకం గర్భస్రావాన్ని కలిగించవచ్చు. ఇది గర్భిణీ స్త్రీకి ఆరోగ్య సంబంధిత సమస్యలు కలిగించడమే కాకుండా బిడ్డకు కూడా హానికరం కలిగిస్తుంది కాబట్టి పైనాపిల్ను తినకుండా ఉండటం మంచిది.
* గర్భధారణ సమయంలో ద్రాక్షను ఎక్కువగా తినడం కూడా గర్భిణీ స్త్రీ, బిడ్డ ఆరోగ్యానికి హానికరం. ద్రాక్షలో “రెస్వెరాట్రాల్” అనే మూలకం ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో వైద్యుడి సలహా తీసుకుని మాత్రమే ద్రాక్ష తినడం మంచిది.
* గర్భధారణ సమయంలో చింతపండు తినడం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా మొదటి నాలుగు మాసాలలో చింతపండు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది గర్భస్రావానికి కారణమవుతుంది. ఈ కారణంగా గర్భిణీ స్త్రీలు చింతపండు తీసుకోవడం మానుకోవడం మంచిది.
Also Read: Whatsapp View Once: వాట్సాప్ యూజర్లకు షాక్.. ‘View Once’ ఫీచర్లో పెద్ద లోపం..
* ఇక అన్నిటికంటే ముఖ్యమైనది పచ్చి బొప్పాయి కూడా గర్భధారణ సమయంలో తినవద్దు. ఇందులో ఉన్న రబ్బరు పాలు గర్భానికి హానికరంగా ఉంటాయి. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా పచ్చి బొప్పాయిని తీసుకోవడం తగదు.
* అరటిపండు గర్భధారణ సమయంలో సర్వసాధారణంగా చాలా పోషకాలు అందిస్తుంది. కానీ, కొన్ని సందర్భాలలో ముఖ్యంగా మధుమేహం ఉన్న మహిళలు అరటిపండు తినడం మితంగా చేసుకోవాలి. అదేవిధంగా, అలెర్జీ సమస్య ఉన్న గర్భిణీ స్త్రీలు కూడా అరటిపండు తినడం సురక్షితం కాదు. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమైనది. కొన్ని పండ్లు, వాటిలో ఉండే రసాయనాల వల్ల గర్భధారణను నష్టపోవచ్చు. కాబట్టి, గర్భిణీ స్త్రీలు ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. వైద్యుడి సలహాతో ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!