Kerala: కేరళ ఆర్థిక సంక్షోభం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు
కేరళ ఆర్థిక సంక్షోభానికి కారణం మీరంటే మీరేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే కారణమని.. ప్రభుత్వం వృథా ఖర్చులు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి కేంద్ర విధానాలే కారణమని కేరళ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ స్పందిస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం విడుదల చేయని నిధులకు సంబంధించి సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ఎప్పుడూ వేర్వేరుగా లెక్కలు చెబుతున్నారని మురళీధరన్ పేర్కొన్నారు.
Read Also: UP: రైలు ఇంజిన్లో మృతదేహం.. కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ట్రైన్
Also Read
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
ఆర్థిక విషయాల్లో కేరళతో పాటు ఇతర ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్ చేసిన ప్రకటనపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి స్పందించారు. కేరళ సీఎం దేశ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా అవగాహన కలిగి ఉండాలని మురళీధరన్ చెప్పారు. కేరళ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగిన మురళీధరన్.. సంక్షేమ పింఛన్లలో కేంద్రం వాటాతో సహా పలు కేటాయింపులు, గ్రాంట్లు ఇప్పటికే కేరళకు ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంటే తదుపరి విడత సంక్షేమ పింఛన్ కోసం ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
మూలధన పెట్టుబడుల కోసం రూ.1,925 కోట్లు.. రాష్ట్రం తప్పనిసరి సమ్మతి నివేదికను సమర్పించనందున ఇవ్వలేదని మురళీధరన్ తెలిపారు. కాగ్ నివేదిక ప్రకారం.. కేరళ రూ. 7,000 కోట్లకు పైగా పన్నులు వసూలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
Read Also: Mrunal Thakur: సీతా.. లవ్ లో పడ్డావా.. ? అది కూడా అతనితో..
అంతకుముందు.. కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్ కేంద్రంపై ఆరోపణలు చేశారు. ఆర్థిక విషయాల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్ సహా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని బాలగోపాల్ అన్నారు. ఈ వివక్షతో కేరళ ఎక్కువగా నష్టపోతోందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయపరమైన పరిష్కారాలను ఆలోచించాలని తెలిపారు.
తాజావార్తలు
-
Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!