కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం అనుసరించిన విధానాలు విజయవంతమయ్యాయి. దీంతో ‘‘అత్యంత పేద రహిత రాష్ట్రం’’గా కేరళ అవతరించింది. ఈ మేరకు నవంబర్ 1న కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారికంగా ప్రకటించనున్నారు. సినీ తారలు మమ్ముట్టి, మోహన్ లాల్, కమల్ హాసన్ సమక్షంలో ఈ ప్రకటన చేయనున్నారు.
Pinarayi Vijayan: 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘‘ది కేరళ స్టోరీ’’ సినిమాకు రెండు ప్రధాన అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు ప్రకటించని కొన్ని గంటల్లోనే కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు అవార్డులు ఇచ్చి కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. ఇలాంటి చిత్రాన్ని సత్కరించడం ద్వారా కేంద్రం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని సీఎం అన్నారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారిక నివాసానికి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. తంపానూర్ పోలీస్ స్టేషన్కు ఈమెయిల్ ద్వారా బెదిరింపు సందేశం అందింది.
CM Revanth Reddy: నియోజకవర్గాల పునర్విభజనతో నష్ట పోనున్న రాష్ట్రాల గళాన్ని వినిపించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో రేపు (మార్చ్ 22) నిర్వహించనున్న సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. చెన్నైలోని గిండీలో గల ఐటీసీ చోళ హోటల్లో ఉదయం 10. 30 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది.
కేంద్రం తీరుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. వయనాడ్లో కొండచరియలు విరిగిపడి చనిపోయిన బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు కేంద్రం సాయం చేయలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Pinarayi Vijayan: ‘‘కేరళ మిని పాకిస్తాన్’’ అంటూ బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యల్ని కేరళ సీఎం పినరయి విజయన్ తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యలు ‘‘ తీవ్రమైన హానికరమైనవి’’, ‘‘పూర్తిగా ఖండించదగినది’’ అని అభివర్ణించారు.
Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ వయనాడ్ ఎన్నికల్లో పోటీపై ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మతతత్వ సంస్థ ‘‘జమాతే ఇస్లామీ’’ మద్దతుతో ఆమె వయనాడోలో పోటీ చేస్తుందని విజయన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆదివారం ప్రియాంకా గాంధీ స్పందించారు.
వన్ నేషన్-వన్ ఎలక్షన్పై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలు వద్దంటూ పినరయి విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఒకే దేశం-ఒకే ఎన్నికలపై కేంద్రం ముందడుగు వేసింది.
అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం షాకిచ్చింది. శబరిమల దర్శనంపై పినరయ విజయన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ భక్తులకు మాత్రమే దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులంతా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించింది.
మలయాళ నటి కవియూర్ పొన్నమ్మ (79) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతిచెందారు.ఆరు దశాబ్దాలకు పైగా విశిష్టమైన కెరీర్ను కొనసాగించింది. కొన్ని నెలలుగా వయోభారంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. పొన్నమ్మ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.