UP: రైలు ఇంజిన్లో మృతదేహం.. కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ట్రైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సిర్సాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్యాసింజర్ రైలు ఇంజిన్కు వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని చూసి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అంతకుముందే.. రైలు ఇంజన్లో యువకుడి మృతదేహం ఇరుక్కోవడంతో కొన్ని కిలోమీటర్ల మేర అలానే ఈడ్చుకెళ్లింది. ఇంజిన్లో మృతదేహాన్ని చూసిన అక్కడి జనాలు పెద్దగా అరుపులు చేయడంతో అది గమనించిన లోకో పైలట్ రైలును ఆపాడు. దీంతో ఇంజిన్లో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటకు తీశారు. ఫరూఖాబాద్-షికోహాబాద్ రైలు మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Read Also: UK Cabinet Reshuffle Update: రిషి సునక్ మంత్రివర్గంలో బ్రిటిష్ మాజీ ప్రధానికి చోటు..
Also Read
- Head Coach: గౌతమ్ గంభీర్కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వచ్చేశారు..
- Trump: ఓ వైపు ఖమేనీ అంత్యక్రియలు.. ఇంకోవైపు టర్కీలో ట్రంప్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ
- Trump: టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాలపై ట్రంప్ యూ-టర్న్.. ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత తప్పదా?
- IND Vs ENG T20: బిగ్ అలర్ట్.. నేటి లైవ్ టీ20 మ్యాచ్ టైమింగ్స్లో మార్పులు..
అనంతరం.. రైలు ఇంజిన్లో చిక్కుకున్న యువకుడి మృతదేహంపై రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అక్కడున్న రైల్వే కార్మికులు ఇంజిన్లో చిక్కుకున్న యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడి చేరుకుని.. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుడు ఎవరు అనేదానిపై గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మృతుడు హాఫ్ జాకెట్, గళ్ల చొక్కా, జీన్స్ ధరించి ఉన్నాడు.
Read Also: Honda New Bike : హోండా నుంచి మార్కెట్ లోకి మరో కొత్త బైక్.. సూపర్ ఫీచర్స్..
ఇదిలా ఉంటే.. యువకుడి మృతదేహం ఇంజిన్ ముందు ఎలా ఇరుక్కుపోయిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. బరాతర స్టేషన్ సూపరింటెండెంట్ తెలిపిన సమాచారం ప్రకారం.. ఫరూఖాబాద్ నుంచి షికోహాబాద్కు వస్తున్న ప్యాసింజర్ రైలు ఇంజన్ ముందు దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఈ క్రమంలోనే ఇంజిన్లో యువకుడు ఇరుక్కున్నట్లు తెలిపారు. ఈ ఘటన భుదా బర్త్రా-అరాన్ మధ్య జరిగిందని అతను చెప్పారు. ఇంజన్లో మృతదేహం ఇరుక్కుపోయి ఉండటాన్ని గ్రామస్థులు చూడగానే రైలును నిలిపివేసి ఇంజిన్లో నుంచి బయటకు తీశామని తెలిపారు.
తాజావార్తలు
-
Head Coach: గౌతమ్ గంభీర్కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వచ్చేశారు..
-
Komatireddy Venkat Reddy : తెలంగాణలో అద్దం లాంటి రోడ్లు.. రూ.13 వేల కోట్లతో మెగా ప్లాన్
-
CM Revanth Reddy : డిజిటల్ గవర్నెన్స్ తో ముందుకు.. క్షేత్రస్థాయి అధ్యయనానికి కమిటీ
-
Trump: ఓ వైపు ఖమేనీ అంత్యక్రియలు.. ఇంకోవైపు టర్కీలో ట్రంప్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ
-
Trump: టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాలపై ట్రంప్ యూ-టర్న్.. ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత తప్పదా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!