Chalamala Krishna Reddy: రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి వచ్చినా.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని నేనే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం దామెరలో మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు, పీసీసీ కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చినా.. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నేనే అంటూ పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి రావడం మంచి పరిణామం.. సీపీఎం, సీపీఐ మద్దతుతో భారీ మెజార్టీతో మునుగోడులో నేను గెలవబోతున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Kerala: దారుణం.. 8 ఏళ్ల బాలికపై రెండేళ్లుగా సవతి తండ్రి అత్యాచారం
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర నాయకుడు.. రాష్ట్రంలో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని పీసీసీ కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనకు చివరి క్షణంలో టికెట్ చేజారింది.. అధిష్టానం సాధారణ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు.. ఆ హామీని నిలబెట్టుకోవాలి అని ఆయన కోరారు. కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దు టికెట్ నాదే, భారీ విజయం నాదే అంటూ చలమల కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Read Also: Minister Jagadish Reddy: ఎవరెన్ని కుట్రలు చేసిన సంక్షేమ పథకాలను అమలు చేస్తాం..
రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేయొద్దని కోరినట్లు చలమల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆయన ఈసారి మునుగోడు నియోజకవర్గం వదిలిపెట్టి రాష్ట్రంలో మరోచోట నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, నారాయణపురం మండలం దామెరలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన చలమల్ల కృష్ణారెడ్డి.. రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి స్వాగతిస్తున్నాను అని తెలిపారు. క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకొని గత 14 నెలలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నానని కార్యకర్తలు అధైర్య పడొద్దని.. టికెట్ తనకే వస్తుందని చలమల కృష్ణారెడ్డి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?