Kerala: దారుణం.. 8 ఏళ్ల బాలికపై రెండేళ్లుగా సవతి తండ్రి అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. తాజాగా.. కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో గత రెండేళ్లుగా 8 ఏళ్ల బాలికపై నిరంతర అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. బాలికపై ఆమె సవతి తండ్రి, అతని సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 32, 30 ఏళ్ల నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: Israel-Hamas War: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయిల్ యుద్ధ ట్యాంకులు.. భూతల దాడికి అంతా సిద్ధం..
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
ఉత్తర కేరళలోని ఒక జిల్లాలో 8 ఏళ్ల బాలికపై ఆమె సవతి తండ్రి, అతని సోదరుడు గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై గురువారం పోలీసులు వివరాలను వెల్లడించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం నాడు 32, 30 ఏళ్ల నిందితులను అరెస్టు చేశారు. అనంతరం అతడిని కోర్టు ముందు హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటన చిత్తరికల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. చిన్నారితో ఆ వ్యక్తి ప్రవర్తనను ఓ మహిళ గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
దీని వెనుక గల కారణాలపై మహిళ బాలికను విచారించింది. ఈ భయంకరమైన సంఘటన గురించి తెలుసుకున్న ఆమె వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించింది. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడే ముందు మద్యం తాగించిన కేసు కూడా ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?