Karumuri Nageswara Rao: బీసీలకు ఏం చేశారో టీడీపీ శ్వేతపత్రం విడుదల చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao: చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని.. ఆయన హయాంలో రైతులు అల్లాడనిపోయారని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వైసీపీ హయాంలో రైతులకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందన్నారు. దళారులకు డబ్బు పోకుండా అది కూడా రైతులకే అందేలా చర్యలు చేపట్టామన్నారు. గన్నీ బ్యాగ్స్ కూడా మేమే ఇస్తున్నామన్నారు. జగన్ చేసిన మేలు చంద్రబాబుకు కనపడదని.. సీఎం జగన్ రైతుల గుండెల్లో ఉన్నారని ఆయన వెల్లడించారు. చంద్రబాబు సీఎం అయితే కరువు కాటకాలేనని ఆయన విమర్శించారు.
జగన్ సీఎం ఐతే నదులు పుష్కలంగా ప్రవహించడంతో పాటు పంటలు బాగా పండుతాయన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే ఎమ్మెస్పీ ధర అధికంగా ఉందన్నారు. వాస్తవాలు తెలుసుకుని రామోజీరావు వార్తలు రాయాలన్నారు. ఇరవై రోజుల్లో ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇస్తున్నామన్నారు. బీసీలకు కోటి 76 లక్షల కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. నలుగురిని రాజ్యసభకి జగన్ పంపారన్న ఆయన.. చంద్రబాబు ఒక్కరి నైనా ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. బీసీలపై ప్రేమ ఎవరికి ఉందో అర్థం కావటం లేదా అని ప్రశ్నించారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
Dasari Kiran Kumar: జగన్ కీలక నిర్ణయం.. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా దాసరి కిరణ్..
కుప్పంలోనే చంద్రబాబుకు సీన్ లేదని తేలిపోయిందని.. బీసీలు ఆయనను నమ్మే పరిస్థితి లేదన్నారు. లోకేష్ ఏం చేశాడని పాదయాత్ర చేస్తాడని ప్రశ్నించారు. ప్రజలంతా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్తున్నారని.. మరి లోకేష్ తన తండ్రి హయాంలో ఏం చేశారని చెప్తారన్నారు. ఒక్క పథకమైనా చెప్పుకునేది ఉందా అంటూ మండిపడ్డారు. అన్ని కులాలూ జగన్ని కావాలని అంటున్నాయన్నారు. బీసీలకు ఏం చేశారో టీడీపీ శ్వేతపత్రం విడుదల చేయాలన్న ఆయన.. తాము ఏం చేశామో విడుదల చేస్తామని సవాల్ విసిరారు. రైతుల నుంచి తడిసిన ప్రతి గింజా కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చంద్రబాబు సీఎస్కు లేఖ రాయటానికి సిగ్గు ఉండాలన్నారు. నిజం చెబితే తల వక్కలు అవుతుందని చంద్రబాబుకు శాపం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే ఆయన అబద్దాలతో లేఖ రాశారని మంత్రి విమర్శించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!