విజయవాడ శివార్లలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యనమలకుదురు పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. భక్తులు స్వామి వారికి భక్తితో సమర్పించుకున్న హుండీ కానుకలను సాక్షాత్తూ ఆలయ అధికారులే కాజేయడం దేవాదాయ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అక్రమాలకు ఆలయ ఈఓ (EO) భవాని సూత్రధారిగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. ఆలయ హుండీ తాళాలు సాధారణంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వద్ద ఉంటాయి. అయితే, ఈఓ భవాని తన సిబ్బందిని పంపి…
Godavari Bathing Ghats : పవిత్ర గోదావరి నది తీరంలోని స్నాన ఘాట్లు ప్రస్తుతం అత్యంత అధ్వాన స్థితిలో ఉన్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం వచ్చే ఈ ఘాట్లు ఇప్పుడు అపరిశుభ్రతకు, దుర్వాసనకు నిలయంగా మారాయి. రాజమండ్రిలో గోదావరి తీర ప్రాంతంలోని స్నాన ఘాట్ల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటంపై స్థానికులు, భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ పవిత్ర గోదావరి స్నానాల…
తన భార్య వివాహేతర సంబంధాన్ని రుజువు చేయడానికి పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ విజయనగరానికి చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యపై ఆరోపణలను నిరూపించడానికి పిల్లలను పావులుగా ఉపయోగించడం సరైంది కాదని స్పష్టం చేసింది. వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు ఇతర ఆధారాలను సేకరించాల్సిందే గానీ, పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు చేయాలని కోరకూడదని తేల్చి చెప్పింది. Also Read: AP High…
AP Ministers Ratings: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశం మొదటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా శాఖలలో ఫైళ్ల క్లియరెన్స్ ఎంత వేగంగా జరుగుతోందనే అంశంపై ఆయన మంత్రులకు రేటింగ్స్ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో నిలిచారు. మంత్రి అచ్చెన్నాయుడు తర్వాతి స్థానాల్లో వరుసగా నిమ్మల రామానాయుడు, కొండపల్లి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో త్వరలో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక అధికారుల నియామక బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ గ్రామ పంచాయతీల సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీకాలం పూర్తయిన మరుసటి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన సహా పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. సమావేశాన్ని ప్రారంభిస్తూ సీఎం చంద్రబాబు మాట్లాడారు. ‘కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ముఖ్యమైన విషయాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం…
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఏపీ మంత్రి మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేయడం తనకు బాధ కలిగించిందన్నారు. సీఎం చంద్రబాబు స్టేట్స్ మెన్ అని ప్రపంచమంతా కీర్తిస్తుందని.. కేసీఆర్కి నచ్చితే ఎంత?, నచ్చకపోతే ఎంత? అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో ఏపీలో రామరాజ్యం ఆరంభమైందని, అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి ఆనం స్పష్టం చేశారు. మంత్రి ఆనం ఈరోజు మీడియాతో మాట్లాడుతూ…
నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. చిన్న డిపోలు, పబ్లు, ఈవెంట్లలో లిక్కర్ సేల్స్ రికార్డు స్థాయికి చేరాయి. చివరి మూడు రోజుల్లో (డిసెంబర్ 29, 30, 31) రాష్ట్ర వ్యాప్తంగా రూ.500 కోట్లు అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పారు. ముఖ్యంగా విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకల్లో జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 30న రెండు రోజుల్లో 11.30 కోట్లు అమ్మకాలు.. డిసెంబర్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీలు, పట్టణాలు మరియు నగరాల్లోని వార్డు సచివాలయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని ‘వార్డు సచివాలయం’ అని కాకుండా ‘స్వర్ణ వార్డు’గా పిలవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు వార్డు సచివాలయాల పేరును స్వర్ణ వార్డులుగా మార్చే ప్రతిపాదనకు కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ మార్పు ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన, మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పేరు మార్పుకు సంబంధించి…
ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్ధులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-2 నోటిఫికేషన్లో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్, స్పోర్ట్స్ పర్సన్లకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడానికి సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. Also Read: Anil Ravipudi-Chiranjeevi: చిరుని చూసి.. చరణ్కు తమ్ముడా అని అడుగుతున్నారు! గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు చేయాలని 2023లో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్ పాయింట్లను సవాలు…