Sheikh Hasina: షేక్ హసీనాపై ‘మర్డర్ కేసు’ నమోదు.. కారణమిదే..?
- బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదు
- ఈ కేసులో హసీనాతో పాటు పలువురి అధికారులపై కేసు
- పోలీసు కాల్పుల్లో కిరాణా దుకాణం యజమాని అబూ సయీద్ మృతి
- ఈ కేసులో పలువురు పోలీసు అధికారులు
- ప్రభుత్వ పెద్దల పేర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కష్టాల ఊబిలో కూరుకుపోతుంది. తాజాగా.. ఆమెపై హత్య కేసు నమోదైందని సమాచారం అందుతోంది. ఈ కేసులో హసీనాతో పాటు పలువురి అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. బంగ్లాలో గత కొన్ని వారాలుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ నిరసనల్లో 500 మందికి పైగా మరణించారు. ఈ క్రమంలో.. హసీనా తన పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ను విడిచిపెట్టి వెళ్లింది.
Mumbai: పట్టపగలే ఓ వ్యక్తిపై మైనర్ బాలుడు కత్తితో దాడి.. అడ్డొచ్చిన వారిని..!
Also Read
- Ben Stokes: "నేను మానసికంగా అలసిపోయాను".. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- Pakistan Minister: "చేతులు నరికేస్తాం".. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
ఢాకా ట్రిబ్యూన్ కథనం ప్రకారం.. హసీనా సహా 6 మందిపై హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసు జూలై 19న ఢాకాలోని మహ్మద్పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసు కాల్పుల్లో కిరాణా దుకాణం యజమాని అబూ సయీద్ మృతి చెందాడు. ఇందులో పలువురు పోలీసు అధికారులు, ప్రభుత్వ పెద్దల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. హసీనాతో పాటు నిందితుల్లో అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ క్వాడర్, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ పోలీస్ ఐజీ చౌదరి అబ్దుల్లా అల్ మామున్, డీబీ మాజీ చీఫ్ హరునోర్ రషీద్, డీఎంపీ మాజీ కమిషనర్ హబీబుర్ రెహమాన్, డీఎంపీ మాజీ అధికారి బిప్లబ్ కుమార్ సర్కార్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా.. ఈ ఘటనకు సంబంధించి మహ్మద్పూర్కు చెందిన అమీర్ హమ్జా షతీల్ ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై మంగళవారం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
Bangalore Bus Accident: బెంగళూరు ఫ్లైఓవర్పై ప్రమాదం.. వాహనాలపైకి దూసుకెళ్లిన ఓల్వో బస్సు!
వివాదాస్పద ఉద్యోగ రిజర్వేషన్ వ్యవస్థపై తన అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృత నిరసనల నేపథ్యంలో.. గత వారం రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయిన 76 ఏళ్ల హసీనాపై నమోదైన మొదటి కేసు ఇది. జూలై 19న రిజర్వేషన్ ఉద్యమానికి మద్దతుగా చేపట్టిన నిరసనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో సయీద్ చనిపోయాడు. ఆగస్టు 5న బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం పతనం తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనల్లో 230 మందికి పైగా మరణించారు. కోటా వ్యతిరేక నిరసనలు జూలై మధ్యలో ప్రారంభమైనప్పటి నుండి హింసలో మరణించిన వారి సంఖ్య 560కి చేరుకుంది. కాగా.. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. 84 ఏళ్ల నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారు. యూనస్ తన 16 మంది సభ్యుల సలహా మండలి పోర్ట్ఫోలియోలను గత వారం ప్రకటించారు.
తాజావార్తలు
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
-
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
-
Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
-
Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!