Mumbai: పట్టపగలే ఓ వ్యక్తిపై మైనర్ బాలుడు కత్తితో దాడి.. అడ్డొచ్చిన వారిని..!
- పట్టపగలే ఓ వ్యక్తిపై మైనర్ బాలుడు కత్తితో దాడి
- ముంబైలోని శివాజీ నగర్ ప్రాంతంలో ఘటన
- దాడిలో పఠాన్ అనే వ్యక్తి మృతి
- ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
- ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పట్టపగలే ఓ వ్యక్తిపై మైనర్ బాలుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబైలోని శివాజీ నగర్ ప్రాంతంలో జరిగింది. ఈ దాడిలో ఆ వ్యక్తి మృతి చెందాడు. బాధితుడిపై బాలుడు పదే పదే కత్తితో దాడికి పాల్పడుతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనకు పాల్పడుతుండగా.. అక్కడే ఉన్న కొంతమంది ఆపలేకపోయారు. అలానే చూస్తూ ఉండిపోయారు. కాగా.. ఈ దాడికి సంబంధించి అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. మృతుడు అహ్మద్ పఠాన్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఓ మహిళ సహా నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా.. ఈ ఘటన ఆగస్ట్ 8న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Also: Rajasthan Shocker: భార్యకు ఘోరమైన శిక్ష.. బైకుకి కట్టి ఈడ్చుకెళ్లిన భర్త..
Also Read
- CM Vijay: బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారో.. విజయ్ పార్టీ వార్నింగ్..
- Tamil Nadu: ఫ్లోర్ టెస్ట్కు ముందు కీలక పరిణామం.. రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ
- Keir Starmer: బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్కు పదవీ గండం.. యూకేలో అసలేం జరుగుతోంది?
- NEET Paper Leak: నీట్ పేపర్ లీక్లో మాస్టర్ మైండ్ అరెస్ట్.. లీక్ జరిగింది ఇలా..
శివాజీ నగర్లోని రోడ్డుపై బాధితుడు పఠాన్ నిలబడి ఉండగా.. ఒక్కసారిగా మైనర్ బాలుడితో సహా నలుగురు అతనిపై పడ్డారు. ఆ తర్వాత బాలుడు పఠాన్పై ఆవేశంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిని ఆపుదామని వచ్చిన బాటసారులను కూడా బాలుడు బెదిరించాడు. ఈ క్రమంలో.. పఠాన్ పై మైనర్ బాలుడు పలుసార్లు దాడి చేస్తూనే ఉన్నాడు. కాగా.. మృతుడు, నిందితులు ఒకరికొకరు తెలుసని.. రెండు వారాల క్రితం వారి మధ్య తీవ్ర వాగ్వాదం, గొడవలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Bangalore Bus Accident: బెంగళూరు ఫ్లైఓవర్పై ప్రమాదం.. వాహనాలపైకి దూసుకెళ్లిన ఓల్వో బస్సు!
ఈ క్రమంలో పఠాన్పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే పట్టపగలు జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. ఈ నెల ప్రారంభంలో థానేలోని రాబోడి ప్రాంతంలో పాత గొడవలు కారణంగా 40 ఏళ్ల వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవ్వడంతో.. దుకాణ యజమానులు తమ సంస్థలను మూసివేశారు. బాధితుడు వసీం ఖురేషీ ఛాతీ, ముఖం, చేతికి తీవ్ర గాయాలయ్యాయి.
- Tags
- attack
- Crime News
- dies
- Man
- minor
తాజావార్తలు
-
CM Vijay: బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారో.. విజయ్ పార్టీ వార్నింగ్..
-
Tamil Nadu: ఫ్లోర్ టెస్ట్కు ముందు కీలక పరిణామం.. రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
-
Telangana Exhibitors : టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలకు అల్టిమేటం!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!