బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కష్టాల ఊబిలో కూరుకుపోతుంది. తాజాగా.. ఆమెపై హత్య కేసు నమోదైందని సమాచారం అందుతోంది. ఈ కేసులో హసీనాతో పాటు పలువురి అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. బంగ్లాలో గత కొన్ని వారాలుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ నిరసనల్లో 500 మందికి పైగా మరణించారు. ఈ క్రమంలో.. హసీనా తన పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ను విడిచిపెట్టి వెళ్లింది.