Crime News : మద్యం తాగించి.. అసభ్యకర ఫొటోలు తీసి.. రూ.46 లక్షలు వసూలు
- బ్లాక్ మెయిల్ చేసిన నిందితుడు
- లక్షల్లో వసులు
- సహకరించిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News : మోసాలకు హద్దు, అదుపు లేకుండా పోతోంది. రోజుకొక కొత్త రూపంలో మోసాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. నమ్మిన వ్యక్తులే ఊహించని రీతిలో మోసం చేస్తున్నారు. తాజాగా మిర్యాలగూడలో అటవీశాఖ ఉద్యోగిని మోసం చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అటవీశాఖ విశ్రాంత ఉద్యోగిని బ్లాక్ బెయిల్ చేసి ఏకంగా రూ.46లక్షలు వసూలు చేశాడు ఓ వ్యక్తి. గతంలో విశ్రాంత ఉద్యోగి త్రిపురాం మండలం రాగడప బీట్ అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసేవాడు. తిరుమలగిరి మండలం గట్టుమీద తండాకు చెందిన ఆంగోత్ గణేశ్ ట్రాన్స్ ఫార్మర్ వైర్లను దొంగతనం చేస్తూ జల్సాలు చేసేవాడు. ఆ విషయం విశ్రాంత ఉద్యోగికి తెలియక అతనితో పరిచయం పెంచుకున్నాడు.
Read Also : Kollu Ravindra: బందరు నిండా బడ్డీ కొట్లు పెట్టించి.. మేం తొలగిస్తే విమర్శలా..?
Also Read
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
గణేశ్ మంచి టైమ్ కోసం వెయిట్ చేసి.. ఓ రోజు విశ్రాంత ఉద్యోగికి పీకల దాకా మందు తాగించాడు. ఓ మహిళకు డబ్బులు ఇచ్చి విశ్రాంత ఉద్యోగితో రకరకాల అసభ్యకర భంగిమల్లో ఉంచి ఫొటోలు తీసుకున్నాడు. వాటిని చూపించి మీ ఫ్యామిలీకి చూపిస్తానంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజటం స్టార్ట్ చేశాడు. వేల నుంచి లక్షలు వసూలు చేశాడు. ముందు జాగ్రత్తతో డబ్బులు వడ్డీకి తీసుకున్నట్టుగా 19 ప్రామిసరీ నోట్ల మీద అధికారి సంతకాలు తీసుకొని తన వద్ద ఉంచుకున్నాడు.
ఓ రోజు వాటిని చూపించి అధికారి కూతురు, అల్లుడి వద్ద ఏకంగా రూ.46లక్షలు వసూలు చేశాడు. ఈ విషయంలో గణేశ్ కు అతని భార్య సహకరించింది. రీసెంట్ గా మరో రూ.3లక్షలు కావాలని ఇద్దరూ కలిసి వేధించారు. ఇక తన వల్ల కాదని ఆ విశ్రాంత ఉద్యోగి ఇంట్లో జరిగిందంతా చెప్పాడు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14లక్షల విలువైన కారుతో పాటు ప్రామిసరీనోట్లు, నాలుగున్నర తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!