Crime News : మద్యం తాగించి.. అసభ్యకర ఫొటోలు తీసి.. రూ.46 లక్షలు వసూలు
- బ్లాక్ మెయిల్ చేసిన నిందితుడు
- లక్షల్లో వసులు
- సహకరించిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News : మోసాలకు హద్దు, అదుపు లేకుండా పోతోంది. రోజుకొక కొత్త రూపంలో మోసాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. నమ్మిన వ్యక్తులే ఊహించని రీతిలో మోసం చేస్తున్నారు. తాజాగా మిర్యాలగూడలో అటవీశాఖ ఉద్యోగిని మోసం చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అటవీశాఖ విశ్రాంత ఉద్యోగిని బ్లాక్ బెయిల్ చేసి ఏకంగా రూ.46లక్షలు వసూలు చేశాడు ఓ వ్యక్తి. గతంలో విశ్రాంత ఉద్యోగి త్రిపురాం మండలం రాగడప బీట్ అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసేవాడు. తిరుమలగిరి మండలం గట్టుమీద తండాకు చెందిన ఆంగోత్ గణేశ్ ట్రాన్స్ ఫార్మర్ వైర్లను దొంగతనం చేస్తూ జల్సాలు చేసేవాడు. ఆ విషయం విశ్రాంత ఉద్యోగికి తెలియక అతనితో పరిచయం పెంచుకున్నాడు.
Read Also : Kollu Ravindra: బందరు నిండా బడ్డీ కొట్లు పెట్టించి.. మేం తొలగిస్తే విమర్శలా..?
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
గణేశ్ మంచి టైమ్ కోసం వెయిట్ చేసి.. ఓ రోజు విశ్రాంత ఉద్యోగికి పీకల దాకా మందు తాగించాడు. ఓ మహిళకు డబ్బులు ఇచ్చి విశ్రాంత ఉద్యోగితో రకరకాల అసభ్యకర భంగిమల్లో ఉంచి ఫొటోలు తీసుకున్నాడు. వాటిని చూపించి మీ ఫ్యామిలీకి చూపిస్తానంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజటం స్టార్ట్ చేశాడు. వేల నుంచి లక్షలు వసూలు చేశాడు. ముందు జాగ్రత్తతో డబ్బులు వడ్డీకి తీసుకున్నట్టుగా 19 ప్రామిసరీ నోట్ల మీద అధికారి సంతకాలు తీసుకొని తన వద్ద ఉంచుకున్నాడు.
ఓ రోజు వాటిని చూపించి అధికారి కూతురు, అల్లుడి వద్ద ఏకంగా రూ.46లక్షలు వసూలు చేశాడు. ఈ విషయంలో గణేశ్ కు అతని భార్య సహకరించింది. రీసెంట్ గా మరో రూ.3లక్షలు కావాలని ఇద్దరూ కలిసి వేధించారు. ఇక తన వల్ల కాదని ఆ విశ్రాంత ఉద్యోగి ఇంట్లో జరిగిందంతా చెప్పాడు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14లక్షల విలువైన కారుతో పాటు ప్రామిసరీనోట్లు, నాలుగున్నర తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..