Crime News : మద్యం తాగించి.. అసభ్యకర ఫొటోలు తీసి.. రూ.46 లక్షలు వసూలు
- బ్లాక్ మెయిల్ చేసిన నిందితుడు
- లక్షల్లో వసులు
- సహకరించిన భార్య
Crime News : మోసాలకు హద్దు, అదుపు లేకుండా పోతోంది. రోజుకొక కొత్త రూపంలో మోసాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. నమ్మిన వ్యక్తులే ఊహించని రీతిలో మోసం చేస్తున్నారు. తాజాగా మిర్యాలగూడలో అటవీశాఖ ఉద్యోగిని మోసం చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అటవీశాఖ విశ్రాంత ఉద్యోగిని బ్లాక్ బెయిల్ చేసి ఏకంగా రూ.46లక్షలు వసూలు చేశాడు ఓ వ్యక్తి. గతంలో విశ్రాంత ఉద్యోగి త్రిపురాం మండలం రాగడప బీట్ అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసేవాడు. తిరుమలగిరి మండలం గట్టుమీద తండాకు చెందిన ఆంగోత్ గణేశ్ ట్రాన్స్ ఫార్మర్ వైర్లను దొంగతనం చేస్తూ జల్సాలు చేసేవాడు. ఆ విషయం విశ్రాంత ఉద్యోగికి తెలియక అతనితో పరిచయం పెంచుకున్నాడు.
Read Also : Kollu Ravindra: బందరు నిండా బడ్డీ కొట్లు పెట్టించి.. మేం తొలగిస్తే విమర్శలా..?
Also Read
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
గణేశ్ మంచి టైమ్ కోసం వెయిట్ చేసి.. ఓ రోజు విశ్రాంత ఉద్యోగికి పీకల దాకా మందు తాగించాడు. ఓ మహిళకు డబ్బులు ఇచ్చి విశ్రాంత ఉద్యోగితో రకరకాల అసభ్యకర భంగిమల్లో ఉంచి ఫొటోలు తీసుకున్నాడు. వాటిని చూపించి మీ ఫ్యామిలీకి చూపిస్తానంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజటం స్టార్ట్ చేశాడు. వేల నుంచి లక్షలు వసూలు చేశాడు. ముందు జాగ్రత్తతో డబ్బులు వడ్డీకి తీసుకున్నట్టుగా 19 ప్రామిసరీ నోట్ల మీద అధికారి సంతకాలు తీసుకొని తన వద్ద ఉంచుకున్నాడు.
ఓ రోజు వాటిని చూపించి అధికారి కూతురు, అల్లుడి వద్ద ఏకంగా రూ.46లక్షలు వసూలు చేశాడు. ఈ విషయంలో గణేశ్ కు అతని భార్య సహకరించింది. రీసెంట్ గా మరో రూ.3లక్షలు కావాలని ఇద్దరూ కలిసి వేధించారు. ఇక తన వల్ల కాదని ఆ విశ్రాంత ఉద్యోగి ఇంట్లో జరిగిందంతా చెప్పాడు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14లక్షల విలువైన కారుతో పాటు ప్రామిసరీనోట్లు, నాలుగున్నర తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!