Nirmala Sitharaman: రామ మందిర ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు నిషేధం.. దేవాలయాల్లో పూజలు, అన్నదానం బ్యాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitharaman: రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశం సిద్ధమవుతోంది. రేపు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట వేడుకలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రామ మందిర కార్యక్రమాలను తమిళనాడులో బ్యాన్ చేశారంటూ ఆరోపించారు. స్థానిక మీడియ కథనాన్ని ఉటంకిస్తూ.. జనవరి 22న రామ మందిర కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీఎంకే ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు, నిర్మాలా సీతారామన్ ఆరోపణల్ని తోసిపుచ్చారు. తమిళనాడులోని దేవాలయాల్లో రాముడికి పూజుల, అన్నదానం వంటి కార్యక్రమాలపై నిషేధం లేదని చెప్పారు.
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
Read Also: Mary Millben: రామ మందిర వేడుకకు రాలేకపోవడం బాధగా ఉంది.. అమెరికన్ సింగర్..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్లో తమిళనాడు డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘ జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. తమిళనాడులో 200 శ్రీరాముడి ఆలయాలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించే దేవాలయాల్లో పూజలు జరగడం లేదు. శ్రీరాముడి పేరిట భజన, ప్రసాదం, అన్నదానానికి అనుమతి లేదు. ప్రైవేట్గా నిర్వహిస్తున్న ఆలయాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించకుండా పోలీసులు అడ్డుపడ్డారు. మండపాలను తీస్తామని నిర్వాహకులు బెదిరిస్తున్నారు. ఈ హిందూ వ్యతిరేకత, ద్వేషాన్ని ఖండిస్తున్నాం’’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
‘లా అండ్ ఆర్డర్’ పేరుతో తమిళనాడులో రామ మందిర ఉత్సవాల లైవ్ టెలికాస్ట్లపై నిషేధం విధించిందని ఆమె ఆరోపించారు. ఇది అధికార డీఎంకే హిందూ వ్యతిరేక ప్రయత్నాల్లో భాగం అని ఆమె అన్నారు. అయితే డీఎంకే ప్రభుత్వ పెద్దలు మాత్రమ నిర్మలా సీతారామన్ అసత్యాలను, పుకార్లను ప్రచారం చేస్తున్నారని, ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తున్నారు.
TN govt has banned watching live telecast of #AyodhaRamMandir programmes of 22 Jan 24. In TN there are over 200 temples for Shri Ram. In HR&CE managed temples no puja/bhajan/prasadam/annadanam in the name of Shri Ram is allowed. Police are stopping privately held temples also… pic.twitter.com/G3tNuO97xS
— Nirmala Sitharaman (@nsitharaman) January 21, 2024
తాజావార్తలు
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!