PM Modi: అయోధ్యలో భవ్య రామమందిరంలో రామ్ లల్లా కొలువుదీరారు. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా సోమవారం రోజున ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. లక్షలాది మంది రామ భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆలయ ట్రస్టు ఆహ్వానాలు అందించడంతో వారంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి నెలలో కేంద్ర మంత్రులు ఎవరూ కూడా అయోధ్య రామ మందిర దర్శనానికి వెళ్లొద్దని ప్రధాని నరేంద్రమోడీ కోరినట్లు సమాచారం.
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో ఆశ్చర్యకరమైన ఘటన ఎదురైంది. కొత్తగా ప్రారంభమయైన మందిరంలోకి కోతి ప్రవేశించింది. గర్భగుడిలోని రామ్ లల్లా విగ్రహం వరకు వెళ్లింది. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 5:50 గంటల ప్రాంతంలో ఒక కోతి దక్షిణ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించింది.
Danish Kaneria celebrate Ram Mandir PranPratishtha ceremony: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా సాగిన ఈ మహా క్రతువుకు దేశ, విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా యావత్ భారతావని ‘జై శ్రీరాం’ నినాదాలతో ప్రతిధ్వనించింది. విదేశాల్లోనూ భారతీయులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు విదేశీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు భారత సంతతి ప్లేయర్స్…
Pakistan: పాకిస్తాన్ మరోసారి తన బుద్ధి చూపించుకుంది. నిలువెల్లా భారత్ వ్యతిరేకతక ప్రదర్శించే ఆ దేశం రామ మందిర ప్రారంభోత్సవంపై అసూయ పడుతోంది. అయోధ్యలో రామ మందిర ఓపెనింగ్ తర్వాత ఆ దేశ విదేశాంగ శాఖ ఎక్స్(ట్విట్టర్)లో కీలక ప్రకటన చేసింది. ‘‘భారత్లోని అయోధ్య నగరంలో కూల్చివేసిన బాబ్రీ మసీదు స్థలంలో 'రామ మందిరం' నిర్మించడాన్ని పాకిస్తాన్ ఖండిస్తోందని’’ ట్వీట్ చేసింది.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ అస్సాంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం హిమంత బిశ్వసర్మ, రాహుల్ గాంధీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ రోజు అస్సాంలోని పవిత్ర బటద్రవా ధామ్ వెళ్లాలని రాహుల్ గాంధీ భావించినప్పటికీ.. భద్రత కారణాల దృష్ట్యా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అంతకుముందు అస్సాం సీఎం దేశంలోనే అవినీతి సీఎం అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు.
Mumbai: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున ర్యాలీలు జరిగాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ముంబై శివార్లలోన మీరా రోడ్లో ఆదివారం రాత్రి ఘర్షణ ఏర్పడింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు.
Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అశేష జనవాహిని హాజరైంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవ్వగా.. సినీ, రాజకీయ, స్పోర్ట్స్, వ్యాపార ప్రముఖులు అతిథులుగా వచ్చారు. శతాబ్ధాల హిందువుల కల నేటితో నిజమైంది.
Ram Mandir: అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరాడు. రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ఈ రోజు భవ్య రామాలయం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, దేశంలోని పలు రంగాలకు చెందిన 7000 మందికి పైగా అతిథులు, లక్షలాది మంది రామభక్తులు ఈ మహోత్సవానికి హాజరయ్యారు.
PM Modi: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కన్నులపండుగగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా "రామ్ లల్లా" విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా వీవీఐపీలు, సాధువులు, సాధారణ భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చారు. రామ మందిర ప్రారంభం తర్వాత ప్రధాని నరేంద్రమోడీ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఇకపై రామ్ లల్లా టెంట్లో ఉండరని, గొప్ప ఆలయంలో ఉంటారని అన్నారు.
Ayodhya Ram Temple: దాదాపు 500 ఏళ్ల హిందువుల కల నేటితో తీరింది. అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా దేశంలోని అతిరథులు, లక్షల మంది ప్రజలు హాజరవ్వగా.. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. దాదాపుగా 400 స్తంభాలు, 44 తలుపులతో అయోధ్య రామ మందిరం నిర్మితమైంది. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ, స్పోర్స్ట్ సెలబ్రెటీలు, ఇతర రంగాల్లో ప్రముఖులు, సాధువులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.…