Congress: జమ్మూ కాశ్మీర్ని పాక్లో భాగంగా చూపించిన కాంగ్రెస్ పోస్ట్.. బీజేపీ విమర్శలు..
- జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్లో భాగంగా చూపుతూ కాంగ్రెస్ పోస్ట్..
- కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కర్ణాటక కాంగ్రెస్ ఎక్స్లో చేసిన ఓ పోస్టు తీవ్ర వివాదాస్పదంగా మారింది. జమ్మూ కాశ్మీర్కి పాకిస్తాన్ భూభాగంగా చూపిస్తున్న ఫోటోని షేర్ చేసింది. పాకిస్తాన్కి ఐఎంఎఫ్ రుణాన్ని ఆపడంలో ప్రధాని నరేంద్రమోడీ, ఆయన ప్రభుత్వం విఫలమైందని విమర్శించడానికి, కాంగ్రెస్ ఈ ఫోటోని షేర్ చేసింది. దీనిపై వెంటనే నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో, ఆ తర్వాత దీనిని డిలీట్ చేసింది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనే 1బిలియన్ డాలర్ల రుణాన్ని ఐఎంఎఫ్ పాకిస్తాన్కి అందించింది.
Read Also: Srisailam Dam: ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్..! మరమ్మతులు చేస్తారా..?
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
- Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
అయితే, ఈ వివాదంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక తీవ్రంగా కాంగ్రెస్ని విమర్శించారు. కాశ్మీర్ని పాకిస్తాన్కి చెందినదిగా చూపించడంపై ‘‘పాపాత్మక పాకిస్తాన్ పట్ల తన కాంగ్రెస్ తన అభిమానాన్ని ప్రదర్శించింది’’ అని ఎద్దేవా చేశారు. మొత్తం మీద, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ పాకిస్తాన్ ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదని ఎక్స్ వేదికగా విమర్శించారు.
ఈ పొరపాటుపై కాంగ్రెస్ నేత, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. ‘‘ఇది చిన్న తప్పు. మేము పోస్ట్ని తొలగించాము.’’ అని చెప్పారు. పదేపదే కాంగ్రెస్ పోస్టులు వివాదాస్పదం కావడం గురించి ప్రశ్నించిన సమయంలో, పోస్టులకు కారణమైన వారిని తొలగించినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!