Congress vs BJP: ఆ కాంగ్రెస్ ఎంపీ పిల్లలు భారతీయులు కాదు.. మండిపడిన హస్తం పార్టీ!
- కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ పై మండిపడిన అస్సాం సీఎం హిమంత శర్మ..
- గోగోయ్ పాకిస్తాన్లో 15 రోజులు ఎందుకు బస చేశారో చెప్పాలని డిమాండ్..
- గౌరవ్ గోగోయ్ పిల్లలు భారతీయులు కాదు: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress vs BJP: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్ ) వేదికగా చేసిన పోస్టులో.. ఎంపీ గోగోయ్ పాకిస్తాన్, నేపాల్ దేశాల్లో పర్యటనలకు సంబంధించిన “స్పష్టమైన ఆధారాలు” తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన పాకిస్తాన్లో 15 రోజుల పాటు ఎందుకు బస చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, మీ పర్యటన యొక్క ఉద్దేశ్యాన్ని స్పష్టం చేయగలరని కోరారు. లేదంటే, వచ్చే సెప్టెంబర్ కంటే ముందే ఆ పూర్తి సమాచారాన్ని బహిరంగంగా వెల్లడిస్తానని అస్సాం సీఎం బిస్వా శర్మ పేర్కొన్నారు.
Read Also: Kishan Reddy: అధికారులపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సీరియస్.. ఎందుకో తెలుసా?
Also Read
ఇక, గౌరవ్ గోగోయ్ భార్యకు పాకిస్థాన్ దేశంలోని ఒక NGO నుంచి జీతం వస్తుందని అస్సాం సీఎం హిమాంత శర్మ పేర్కొన్నారు. భారతదేశంలో నిర్వహించే కార్యకలాపాలకు పాకిస్తాన్కు చెందిన ఆ సంస్థ ఎందుకు జీతం చెల్లిస్తోందని ప్రశ్నించారు. అలాగే, హస్తం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడి ఇద్దరు పిల్లలు ఇకపై భారత పౌరులు కారని సీఎం హిమంత బిస్వా శర్మ తేల్చి చెప్పారు.
Read Also: Jagga Reddy: కుల గణనపై తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదు..
అయితే, ఈ సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ రెండు ప్రశ్నలను సంధించారు. కాగా, 1) నేను, నా భార్య శత్రు దేశ ఏజెంట్లు అనే మీ ఆరోపణలను నిరూపించడంలో విఫలమైతే మీరు సీఎం పదవీకి రాజీనామా చేస్తారా..? 2) నేను కూడా మీ పిల్లలు, భార్యపై ప్రశ్నలు అడిగితే సరైన ఆధారాలతో సమాధానం చెప్తారా..? అని కాంగ్రెస్ ఎంపీ డిమాండ్ చేశారు. ఇక, మీ సొంత (బీజేపీ) పార్టీలో కేంద్రమంత్రులు ఎస్. జైశంకర్ ఇద్దరు పిల్లల గురించా?, లేదా పియూష్ గోయల్ పిల్లలా?.. లేక హర్దీప్ సింగ్ పూరి పిల్లలా? గురించా లేదంటే ఎంపీ సుధా మూర్తి పిల్లలు కూడా ఇతర దేశాల పౌరసత్వం కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఇతర పార్టీలోని వ్యక్తులపై ఇంత పెద్ద ఆరోపణలు చేసేటప్పుడు తమ సొంత పార్టీలోని వారి గురించి కూడా తెలుసుకోవాలని అస్సాం సీఎం హిమంత శర్మకు సూచించారు.
తాజావార్తలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?