PM Modi: అస్సాం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు అస్సాంను పాకిస్తాన్కు అప్పగించాలని కాంగ్రెస్ కుట్ర చేసిందని మోడీ ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ, ఎదురుదాడి చేసింది. శనివారం గౌహతిలో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘అస్సాంను పూర్వపు తూర్పు పాకిస్తాన్లో భాగం చేయడానికి ముస్లిం లీగ్, బ్రిటిష్ వారితో చేతులు కలపడానికి సిద్ధమవడం ద్వారా కాంగ్రెస్ "పాపం"…
PM Modi: గౌహతి విమానాశ్రయం కొత్త టెర్మినల్ను శనివారం ప్రధాని నరంద్రమోడీ ప్రారంభించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నంత కాలం అస్సాం, ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, ఈ ప్రాంత భద్రత, గుర్తింపును పణంగా పెట్టి చొరబాటుదారుల్ని రక్షించిందని ఆరోపించారు.
Assam: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సంచలన బిల్లుకు ఆమోదం తెలిపింది. ‘‘బహుభార్యత్వాన్ని’’ నిషేధించే బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు ప్రకారం, ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిలు చేసుకునే వ్యక్తులకు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఒక వేళ పెళ్లయిన సమాచారాన్ని దాచి పెట్టి మరో వివాహం చేసుకుంటే పదేళ్ల వరకు కఠినమైన శిక్ష విధించబడుతుంది. ఈ బిల్లుపై సీఎం హిమంత మాట్లాడుతూ.. ‘‘ఇది ఇస్లాంకు వ్యతిరేకం కాదు. నిజమైన ఇస్లామిక్…
Himanta Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి కాంగ్రెస్ ఎంపీ, అస్సాం పీసీసీ చీఫ్ గౌరవ్ గొగోయ్ను మరోసారి టార్గెట్ చేశారు. ఆయన విదేశీ శక్తుల చేత నాటబడిన ఒక పాకిస్తానీ ఏజెంట్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన ఆరోపణలు అబద్ధమైతే, గొగోయ్ తనపై పరువునష్టం దాఖలు చేయాలని సవాల్ విసిరారు.
అస్సాంలోని కాకోపథర్లోని భారత ఆర్మీ శిబిరంపై గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులకు గాయాలయ్యాయి. స్థానిక నివేదికల ప్రకారం.. ఆకస్మిక దాడిని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (NSCN-K-YA), యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ULFA-ఇండిపెండెంట్) సంయుక్త బృందం నిర్వహించాయి. ఈ రెండూ కూడా నిషేధిత తిరుగుబాటు సంస్థలు.
అస్సాంలో ఓ మహిళా ఆఫీసర్ కోట్లకు పడగలెత్తింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా అవినీతికి తెరలేపింది. తక్కువ కాలంలోనే కోట్లు వెనకేసుకుంది. అధికారులు జరిపిన సోదాల్లో కోట్లలో నగదు దొరకడంతో సివిల్ సర్వీస్ అధికారి నుపుర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు.
భూప్రకంపనలు అంటే ఎవరైనా హడలెత్తిపోతారు. బతుకు జీవుడా అంటూ పరుగులు పెడతారు. ఏ ఒక్కరికైనా భయాందోళనలు సహజం. కానీ అస్సాంలోని నర్సులు మాత్రం వృత్తికి తగినట్టుగా తమ బాధ్యతలు నెరవేర్చి శెభాష్ అనిపించుకుంటున్నారు.
Spider Bite: తూర్పు అస్సాంలోని టిన్సుకియా జిల్లాలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టిన్సుకియా జిల్లా పనిటోలా గ్రామంలో ఏడేళ్ల బాలిక సాలీడు (Spider) కాటుతో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పిల్లలు ఆడుకుంటుండగా.. ఆ చిన్నారి గుడ్లు ఉన్న ఓ వెదురు బుట్టలో ఉన్న గుడ్ల కోసం తెరిచింది. ఆలా తెరవగానే ఆ బుట్టలో ఉన్న నల్లటి సాలీడు చిన్నారి చేతిపై కొరికింది. దీంతో చిన్నారి చేయి వెంటనే…
అస్సాంలో దారుణం జరిగింది. నకిలీ బిల్లులు క్లియర్ చేసే విషయంలో పై అధికారుల నుంచి అధిక ఒత్తిడి రావడంతో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PwD)లో అసిస్టెంట్ ఇంజనీర్(30)గా పని చేస్తున్న మహిళా ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది.
Assam: అస్సాంలో స్థానిక ప్రజలు, భారతీయులకు ఆయుధాలు ఇచ్చేందుకు అక్కడి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయుధ లైసెన్సులు మంజూరు చేసేందుకు ఒక పోర్టల్ ప్రారంభించాలని యోచిస్తోంది. ఆగస్టు మొదటి వారంలో ఈ పోర్టల్ ప్రారంభించబడుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం తెలిపారు. ఆక్రమిత అటవీ, చిత్తడి నేలల నుంచి అక్రమ స్థిర నివాసులు, ఆక్రమణదారులు, ఎక్కువగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను తరిమికొట్టడానికి రాష్ట్రం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది.