Salman Khurshid: మనం ఏం చేసినా ఒక అర్థం ఉంది.. పాక్ అర్థం చేసుకోకపోతే..!
- ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి..
- లేకుంటే ఎన్ని చర్చలు జరిపినా ఆశించిన ఫలితం రాదు..
- భారత మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khurshid: ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి, లేకుంటే ఎన్ని చర్చలు జరిపినా ఆశించిన ఫలితం రాదని స్పష్టం చేశారు భారత మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్.. ఇప్పుడు భారత్ జాగ్రత్తగా ఉండాలన్నారు.. ఆపరేషన్ సిందూర్లో భాగస్వాములైనమా అధికారులకు సెల్యూట్ చేయండి, వారిని చూస్తే గర్వంగా ఉంది.. సాయుధ దళాలు అద్భుతమైన నిర్ణయాలతో విజయం సాధించాయి అంటూ ఆపరేషన్ సిందూర్పై ప్రశంసలు కురిపించారు.. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, ఖుర్షీద్ మాట్లాడుతూ.. మనం ఏమి చేసినా, మనం ఏమి చేరుకోవడానికి ప్రయత్నించినా.. చివరికి దానికి ఒక సారాంశం ఉంది.. అదే ఉగ్రవాదాన్ని లేకుండా చేయడమే అన్నారు ఖుర్షీద్.. ఇంకా ఏవైనా ఉగ్రవాద దాడులు జరిగితే యుద్ధ చర్యగా పరిగణిస్తామని.. తదనుగుణంగా వ్యవహరిస్తామని భారత్ ప్రకటించింది.. కానీ, యుద్ధ చర్యకు ప్రతిస్పందించడానికి కూడా పరిమితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు..
Read Also: Tri Series: సెంచరీతో చెలరేగిన స్మృతి మందాన.. ఫైనల్లో శ్రీలంక పై ఘన విజయం..!
Also Read
- Donald Trump: భారత్పై దాడి జరిగితే అమెరికా అండగా ఉంటుంది.. ట్రంప్ భారీ హామీ
- Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
- Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
- Supreme Court: ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’.. నిందితులు జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఆమోదయోగ్యం కాదని పాకిస్తాన్ స్పష్టమైన ప్రకటనతో అంగీకరించాలని డిమాండ్ చేశారు సల్మాన్ ఖుర్షీద్.. అది చేయకపోతే, పెద్దగా సాధించడానికి అవకాశం ఉందని నేను అనుకోను అన్నారు.. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద నెట్వర్క్ను నిర్వీర్యం చేసే సామర్థ్యాన్ని భారతదేశం ప్రపంచానికి తెలియజేసిందా? అని వేసిన ప్రశ్నకు సమాధానంగా.. ఇది చాలా సున్నితమైన అంశం.. ఉగ్రవాద నెట్వర్క్ కూల్చివేయబడిందని.. త్వరలో అది కనిపించదని భారతదేశం ఆలోచించగలదా అని ప్రశ్నించారు?.. అది చాలా ఆశాజనకంగా ఉంటుందని నేను భావిస్తున్నాను అన్నారు.. ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రవాద స్థావరాలపై దాడుల సమయంలో లక్ష్యంగా చేసుకున్న తొమ్మిది ప్రదేశాలలో రెండు లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం మురిడ్కే, జైషే మొహమ్మద్ ప్రధాన స్థావరం భవల్పూర్ ఉన్నాయన్న ఆయన.. ఆపరేషన్ సిందూర్ తో భారతదేశం ప్రతీకారం తీర్చుకున్న తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణను ప్రకటించింది.. కానీ, కొన్ని గంటల్లోనే దానిని ఉల్లంఘించిందని ఫైర్ అయ్యారు భారత మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్.
తాజావార్తలు
-
Shubman Gill: కోచ్ రికార్డునే బ్రేక్ చేసిన శిష్యుడు.. సెంచరీల్లో శుభమన్ గిల్ సరికొత్త రికార్డు..
-
Donald Trump: భారత్పై దాడి జరిగితే అమెరికా అండగా ఉంటుంది.. ట్రంప్ భారీ హామీ
-
Telangana : ‘ట్రంప్ అవెన్యూ’పై రగడ.. రేవంత్ సర్కార్కు లెఫ్ట్ వార్నింగ్.!
-
Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్లోకి చేరిన ఐదో భారతీయుడు..
-
Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!