Salman Khurshid: మనం ఏం చేసినా ఒక అర్థం ఉంది.. పాక్ అర్థం చేసుకోకపోతే..!
- ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి..
- లేకుంటే ఎన్ని చర్చలు జరిపినా ఆశించిన ఫలితం రాదు..
- భారత మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khurshid: ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి, లేకుంటే ఎన్ని చర్చలు జరిపినా ఆశించిన ఫలితం రాదని స్పష్టం చేశారు భారత మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్.. ఇప్పుడు భారత్ జాగ్రత్తగా ఉండాలన్నారు.. ఆపరేషన్ సిందూర్లో భాగస్వాములైనమా అధికారులకు సెల్యూట్ చేయండి, వారిని చూస్తే గర్వంగా ఉంది.. సాయుధ దళాలు అద్భుతమైన నిర్ణయాలతో విజయం సాధించాయి అంటూ ఆపరేషన్ సిందూర్పై ప్రశంసలు కురిపించారు.. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, ఖుర్షీద్ మాట్లాడుతూ.. మనం ఏమి చేసినా, మనం ఏమి చేరుకోవడానికి ప్రయత్నించినా.. చివరికి దానికి ఒక సారాంశం ఉంది.. అదే ఉగ్రవాదాన్ని లేకుండా చేయడమే అన్నారు ఖుర్షీద్.. ఇంకా ఏవైనా ఉగ్రవాద దాడులు జరిగితే యుద్ధ చర్యగా పరిగణిస్తామని.. తదనుగుణంగా వ్యవహరిస్తామని భారత్ ప్రకటించింది.. కానీ, యుద్ధ చర్యకు ప్రతిస్పందించడానికి కూడా పరిమితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు..
Read Also: Tri Series: సెంచరీతో చెలరేగిన స్మృతి మందాన.. ఫైనల్లో శ్రీలంక పై ఘన విజయం..!
Also Read
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఆమోదయోగ్యం కాదని పాకిస్తాన్ స్పష్టమైన ప్రకటనతో అంగీకరించాలని డిమాండ్ చేశారు సల్మాన్ ఖుర్షీద్.. అది చేయకపోతే, పెద్దగా సాధించడానికి అవకాశం ఉందని నేను అనుకోను అన్నారు.. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద నెట్వర్క్ను నిర్వీర్యం చేసే సామర్థ్యాన్ని భారతదేశం ప్రపంచానికి తెలియజేసిందా? అని వేసిన ప్రశ్నకు సమాధానంగా.. ఇది చాలా సున్నితమైన అంశం.. ఉగ్రవాద నెట్వర్క్ కూల్చివేయబడిందని.. త్వరలో అది కనిపించదని భారతదేశం ఆలోచించగలదా అని ప్రశ్నించారు?.. అది చాలా ఆశాజనకంగా ఉంటుందని నేను భావిస్తున్నాను అన్నారు.. ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రవాద స్థావరాలపై దాడుల సమయంలో లక్ష్యంగా చేసుకున్న తొమ్మిది ప్రదేశాలలో రెండు లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం మురిడ్కే, జైషే మొహమ్మద్ ప్రధాన స్థావరం భవల్పూర్ ఉన్నాయన్న ఆయన.. ఆపరేషన్ సిందూర్ తో భారతదేశం ప్రతీకారం తీర్చుకున్న తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణను ప్రకటించింది.. కానీ, కొన్ని గంటల్లోనే దానిని ఉల్లంఘించిందని ఫైర్ అయ్యారు భారత మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!