Tri Series: సెంచరీతో చెలరేగిన స్మృతి మందాన.. ఫైనల్లో శ్రీలంక పై ఘన విజయం..!
- భారత్ మహిళల జట్టు మరో సిరీస్ను కైవసం
- సెంచరీతో చెలరేగిన స్మృతి మందాన..
- ఫైనల్లో శ్రీలంక పై 97 పరుగుల తేడాతో ఘన విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tri Series: శ్రీలంక వేదికగా జరిగిన మహిళల మూడు జట్ల వన్డే ట్రై సిరీస్ ఫైనల్లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నేడు కొలంబో (ఆర్పిఎస్) స్టేడియంలో శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 97 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మందాన మరోసారి తన తడాఖా చూపించింది. ఆమె 101 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సులతో 116 పరుగుల అద్భుత శతకం బాదింది. ఆమెకు తోడుగా హర్లీన్ డియోల్ (47), హర్మన్ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగ్స్ (44) పరుగులతో నిలిచారు. చివర్లో దీప్తి శర్మ (20 నాటౌట్) ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. ఇక శ్రీలంక బౌలింగ్లో మాల్కీ మడారా, దెవ్మి విహంగా, సుగంధిక కుమారి చెరో రెండు వికెట్లు తీశారు.
Read Also: Google Pixel 8: డోంట్ మిస్.. ఆ హై ఎండ్ స్మార్ట్ఫోన్ పై ఏకంగా రూ.31,000 భారీ డిస్కౌంట్..!
Also Read
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
ఇక 343 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళలు 48.2 ఓవర్లలో కేవలం 245 పరుగులకే ఆలౌట్ అయ్యారు. కెప్టెన్ చమారి అథపత్లు 51, నీలక్షిక సిల్వా 48 పరుగులతో రాణించినా, మిగతా ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక భారత్ బౌలింగ్లో స్నేహ రానా 9.2 ఓవర్లలో 38 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. అమన్జోత్ కౌర్ 3 వికెట్లు తీయగా, శ్రీ చరణి ఒక వికెట్ తీసింది. దీనితో 97 పరుగుల తేడాతో భారత మహిళా జట్టు వన్డే ట్రై సిరీస్ ను కైవసం చేసుకుంది.
Read Also: Polycet 2025: పాలీసెట్-2025 పరీక్షకు సర్వం సిద్ధం.. ఒక్క నిమిషం ఆలస్యం అయిన ‘నో ఎంట్రీ’
ఇక ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా ‘స్మృతి మందాన’ ఎంపిక అవ్వగా.. ప్లేయర్ అఫ్ ది సిరీస్ గా ‘స్నేహ రానా’ ఎన్నికైంది. ఇక ఈ మ్యాచ్ లో స్మృతి మందాన సెంచరీ చేయడంతో వన్డేలలో అత్యధిక సెంచరీలు చేసిన మూడో మహిళగా రికార్డ్ సాధించింది.
తాజావార్తలు
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!